Illegal affair: ఫ్యాక్టరీలో భర్త కష్టపడుతుంటే ఇంట్లో ప్రియుడితో కుస్తీ పడుతున్న భార్య, చివరికి !
లూధియానా/ పంజాబ్: చక్కగా భర్తతో కాపురం చేస్తున్న భార్య ఇంట్లో సంతోషంగా ఉండేది. భర్త ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజూ భర్త ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెలుతున్నాడు, భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య ఇంట్లోనే ఉంటున్నది. పరిచయం అయిన యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త బయట కష్టపడి పని చేస్తుంటే అతని భార్య ఇంట్లో ప్రియుడితో అంతే కష్టపడి ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న భర్త అతని భార్యను మందలించాడు. తన భార్య అక్రమ సంబంధం విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భయపడిన భర్త ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత భార్య ఆమె ప్రియుడితో జెండా ఎత్తేసింది. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్య లేచిపోయిన విషయం తెలుసుకుని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు అతను తన ఆత్మహత్యకు తన భార్య, ఆమె ప్రియుడు కారణం అని పిన్ టూ పిన్ రాసి పెట్టడం కలకలం రేపింది.

అందమైన భార్య చిక్కిందని ఆనందం
పంజాబ్ లోని లూధియానాలోని హీరా నగర్ లోని నూర్వాలా రోడ్డులో విమల్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం విమల్ కుమార్ ఏక్తా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ఏక్తా ఆమె భర్త విమల్ కుమార్ తో చక్కగా కాపురం చేస్తూ ఇంట్లో సంతోషంగా ఉండేది.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
విమల్ కుమార్ లూధియానాలోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజూ విమల్ కుమార్ ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెలుతున్నాడు, భర్త విమల్ కుమార్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య ఏక్తా ఇంట్లోనే ఉంటున్నది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాకేష్ కుమార్ అనే యువకుడు విమల్ కుమార్ భార్య ఏక్తాకు పరిచయం కావడంతో అక్కడ కథ మలుపు తిరిగింది.

ఫ్యాక్టరీలో భర్త కష్టపడుతుంటే ఇంట్లో ప్రియుడితో కుస్తీ పడుతున్న భార్య
పరిచయం అయిన రాకేష్ కుమార్ అనే యువకుడితో విమల్ కుమార్ భార్య ఏక్తా అక్రమ సంబంధం పెట్టుకుంది. విమల్ కుమార్ ఫ్యాక్టరీలో కష్టపడి పని చేస్తుంటే అతని భార్య ఏక్తా ఇంట్లో ఆమె ప్రియుడు రాకేష్ కుమార్ తో అంతే కష్టపడి, కుస్తీపడుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. చాలా కాలం ఏక్తా, రాకేష్ కుమార్ అక్రమ సంబంధం విషయం సీక్రేట్ గా సాగిపోయింది.

పరువు పోతుందని సైలెంట్ గా ఉండిపోయిన భర్త
రానురాను ఏక్తా విచ్చలవిడిగా తయారైయ్యింది. భార్య ఏక్తా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ఆమె భర్త విమల్ కుమార్ అతని భార్యను మందలించి పద్దతి మార్చుకోవాలని బుద్దిమాటలు చెప్పాడు. తన భార్య ఏక్తా అక్రమ సంబంధం విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భయపడిన విమల్ కుమార్ ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయి లోలోపల కుమలిపోయాడు.

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య
ఎప్పటిలాగా ఉదయం విమల్ కుమార్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్లాడు. తరువాత విమల్ కుమార్ భార్య ఏక్తా ఆమె ప్రియుడు రాకేష్ కుమార్ తో కలిసి జెండా ఎత్తేసింది. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెళ్లిన విమల్ కుమార్ అతని భార్య ఏక్తా ఆమె ప్రియుడితో లేచిపోయిన విషయం తెలుసుకుని ఆవేదన చెందాడు. తెలిసిన బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీశాడు. చివరికి విమల్ కుమార్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

డెత్ నోట్ లో పిన్ టూ పిన్ రాసిపెట్టిన భర్త
ఆత్మహత్య చేసుకునే ముందు విమల్ కుమార్ తన ఆత్మహత్యకు తన భార్య ఏక్తా, ఆమె ప్రియుడు రాకేష్ కుమార్ కారణం అని పిన్ టూ పిన్ రాసి పెట్టడం కలకలం రేపింది. విమల్ కుమార్ సోదరుడు కమల్ కుమార్ ఫిర్యాదు చెయ్యడంతో ఏక్తా, ఆమె ప్రియుడు రాకేష్ కుమార్ మీద కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నామని లూధియానా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications