Illegal affair: నా భార్యకు ఆ విషయంలో ?, 8 ఏళ్లుగా అదే పంచాయితీ, గొడ్డలితో నరికి చంపేసిన భర్త !
రాజ్ కోట్: పెళ్లి చేసుకున్న యువకుడు అతని భార్యతో సంతోషంగా జీవనం సాగించాలని అనుకున్నాడు. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలు దంపతులు హ్యాపీగానే ఉన్నారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన భార్య వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తోందని, తనకు అన్యాయం చేస్తోందని ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చెయ్యడంతో కళ్లు మూసుకుని ఒకే ఇంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే అక్రమ సంబంధం విషయంలో భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన భర్త గొడ్డలి తీసుకుని భార్యను దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

10 ఏళ్ల క్రితం పెళ్లి
రాజ్ కోట్ సమీపంలోని జస్థాన్ ప్రాంతంలో సునీల్ పర్మార్ అలియాస్ సునీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూసిన దయా అనే యువతితో సునీల్ పర్మార్ వివాహం జరిగింది. దయాను పెళ్లి చేసుకున్న సునీల్ అతని భార్యతో సంతోషంగా జీవనం సాగించాలని అనుకున్నాడు.

రెండేళ్ల క్రితం మొదలైయిన పంచాయితీ
పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలు సునీల్, దయా దంపతులు హ్యాపీగానే ఉన్నారు. రానురాను సునీల్, దయా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన భార్య దయా వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తోందని, తనకు అన్యాయం చేస్తోందని ఆమె భర్త సునీల్ కు అనుమానం మొదలైయ్యింది.

భార్య తీరుకూడా అలేగా ఉంది
వ్యవసాయం చేస్తున్న సునీల్ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళితే రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. పగటి పూట సునీల్ భార్య దయా ఇంట్లోనే ఉంటున్నది. ఇదే సమయంలో ఇంటి సమీపంలో ఉన్న యువకుడితో దయా ఎక్కువ చనువుగా ఉంటున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి దగ్గర యువకుడితో చనువుగా ఉంటున్న తన భార్య దయాకు ఆమె పుట్టింటి దగ్గర ఓ లవర్ ఉన్నాడని సునీల్ ఇంకా అనుమానం పెంచుకున్నాడు.

భార్యను గొడ్డలితో నరికేసిన భర్త
గత 8 సంవత్సరాల నుంచి ఇదే విషయంలో సునీల్, దయా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చెయ్యడంతో కళ్లు మూసుకుని ఒకే ఇంట్లో సునీల్, దయా దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే అక్రమ సంబంధం విషయంలో అర్దరాత్రి సునీల్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన సునీల్ గొడ్డలి తీసుకుని అతని భార్య దయా తల మీద, వీపు మీద దారుణంగా నరికేశాడు.

అల్లుడి మీద కేసు పెట్టిన మామ
తీవ్రగాయాలైన దయాను రాజ్ కోట్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై మరుసటి రోజు దయా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసు అధికారులు అన్నారు. దయా తండ్రి జీవాబాయ్ చిటారియా కేసు పెట్టడంతో సునీల్ ను మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications