Illegal affair: ప్రియుడితో రెండో భార్య ?, భర్తకు తెలిసి ఫ్రెండ్ తో రేప్ చేయించాడు. ఫస్ట్ భార్యతో కలిసి, ఫినిష్
న్యూఢిల్లీ/ గురుగ్రామ్: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన తరువాత ఆమె మీద అనుమానంతో విడాకులు ఇచ్చేశాడు. కొంతకాలం తరువాత మరో మహిళను అతను వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో ప్రస్తుతం అతను కాపురం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న భర్త ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉంటున్నాడు. ఇంటిలో ఉంటున్న రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది. రెండో భార్యకు ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ లు ఇచ్చిన భర్త ఆమె తీరుతో విసిగిపోయాడు.
ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త అతని మొదటి భార్య, ఆమె బాయ్ ఫ్రెండ్ సహాయం తీసుకున్నాడు. ఫ్రెండ్ తో రెండో భార్య మీద అత్యాచారం చేయించాడు. ఫ్రెండ్ అత్యాచారం చేసిన తరువాత మొదటి భార్య, ఫ్రెండ్ సహాయంతో రెండో భార్యను హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి నిర్జనప్రదేశంలో విసిరేశాడు. గ్రహాలు అనుకూలించకపోవడంతో రెండో భార్య హత్య కేసులో ఆమె భర్త, అతని మొదటి భార్య, మహిళ మీద అత్యాచారం చేసిన కిరాతకుడు అందరూ పోలీసులు చిక్కిపోయారు.
మొదటి భార్యకు విడాకులు
దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో రిషీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బేబీ అనే మహిళను వివాహం చేసుకున్న రిషీ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. కొన్ని సంవత్సరాలు భార్య బేబీతో కాపురం చేసిన తరువాత బేబీ మీద అనుమానంతో రిషీ ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.
రెండో పెళ్లి చేసుకున్న భర్త
బేబీకి విడాకులు ఇచ్చేసిన కొంతకాలం తరువాత మమత అనే మహిళను రిషీ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య మమతతో ప్రస్తుతం రిషీ కాపురం చేస్తున్నాడు. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న రిషీ ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉంటున్నాడు. మమత పగలు అంతా ఆమె ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో కాలం గడిపేస్తోంది.
రెండో భార్య అక్రమ సంబంధంతో ?
మమత ఎక్కువగా వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతోంది. భర్త రిషీ బయటకు వెళ్లిన తరువాత గంటలు గంటలు బయట తిరిగుతున్న మమత భర్త వచ్చే సమయానికి ఇంటికి వస్తోంది. ఇంటిలో ఉంటున్న తన రెండో భార్య మమత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త రిషీకి తెలిసిపోయింది. రెండో భార్య మమతకు ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ లు ఇచ్చిన రిషీ ఆమె తీరుతో విసిగిపోయాడు.
మొదటి భార్య, ఆమె బాయ్ ఫ్రెండ్ తో ?
ఇక లాభం లేదని డిసైడ్ అయిన రిషీ రెండో భార్య మమతను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. రెండో భార్యను చంపడానికి రిషీ అతని మొదటి భార్య బేబీ, ఫ్రెండ్ కరణ్ సహాయం తీసుకున్నాడు. ఏప్రిల్ 18వ తేదీన ఫ్రెండ్ కరణ్ తో రెండో భార్య మమత మీద అత్యాచారం చేయించిన కిరాతకుడు రిషీ అతని కసి తీర్చుకున్నాడు.
రెండో భార్యను రేప్ చేయించిన భర్త
ఫ్రెండ్ కరణ్ రెండో భార్య మమతను అత్యాచారం చేసిన తరువాత మొదటి భార్య బేబీ, ఫ్రెండ్ కరణ్ సహాయంతో రెండో భార్య మమతను హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి నరేలా ఏరియాలోని పంజాబీ కాలనీ పాకెట్ ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్ సమీపంలోని నిర్జనప్రదేశంలో విసిరేశాడు.
గ్రహాలు అనుకూలించలేదు
మరుసటి రోజు మమత శవాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి అనేక కోణాల్లో విచారణ చేశారు. గ్రహాలు మొత్తం అనుకూలించకపోవడంతో రెండో భార్య మమత హత్య కేసులో ఆమె భర్త రిషీ, అతని మొదటి భార్య బేబీ, మహిళ మీద అత్యాచారం చేసిన కిరాతకుడు కరణ్ ముగ్గురూ ఢిల్లీ పోలీసులు చిక్కిపోయారు.