Illegal affair: భర్త ఫ్రెండ్ తో ఆంటీ రొమాన్స్, కూతురికి పెళ్లి చేసింది, భార్య రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీతో !
లక్నో/ఘాజియాబాద్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్య పక్కదారి పట్టింది. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య అక్రమ సంబంధం విషయం అంత త్వరగా బయటపడలేదు. చాలా సంవత్సరాల పాటు ఆంటీ ఆమె భర్త స్నేహితుడితో ఎంజాయ్ చేస్తోంది. భార్య, స్నేహితుడు మంచి రసపట్టులో ఉన్న సమయంలో భర్త ఎంట్రీ ఇచ్చాడు.
తరువాత చాలా కథ జరిగింది. మూడు రోజుల తరువాత గోనే సంచిలో ఆంటీ భర్త భద్రంగా శవమై కనిపించాడు. భర్త ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టేసి, సింపుల్ గా చంపేసి గోనే సంచిలో మూటకట్టి తీసుకెళ్లి పొలంలో విసిరేసి చేతులు దులుపుకున్నారు. అయితే కూతురికి పెళ్లి చేసిన తరువాత ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
భార్యతో సంతోషంగా జీవించాడు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజియా బాద్ లో సునీల్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం దీపా (42) అనే మహిళతో సునీల్ పెళ్లి జరిగింది. వివాహం చేసుకున్న సునీల్, దీపా దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. దీపా, సునీల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్త ఫ్రెండ్ ను లైన్ లో పెట్టిన ఆంటీ
పిల్లలు పుట్టిన తరువాత సునీల్ భార్య దీపా పక్కదారి పట్టింది. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త సునీల్ స్నేహితుడు రవితో దీపా చనువు పెంచుకుంది. భర్త సునీల్ ఫ్రెండ్ రవిని లైన్ లో పెట్టిన దీపా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మేస్త్రీ పని చేస్తున్న సునీల్ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వెలుతున్నాడు.
10 ఏళ్ల నుంచి ప్రియుడితో ఎంజాయ్
గత 10 సంవత్సరాల నుంచి దీపా, రవితో అక్రమ సంబందం పెట్టుని జల్సా చేస్తోంది. సునీల్ భార్య దీపా అక్రమ సంబంధం విషయం అంత త్వరగా బయటపడలేదు. చాలా సంవత్సరాల పాటు దీపా ఆంటీ ఆమె భర్త సునీల్ స్నేహితురు రవితో రొమాన్స్ చేస్తూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. దీపా కూతురికి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది.
బెడ్ రూమ్ లో భార్య, ప్రియుడు రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీ
భార్య దీపా, స్నేహితుడు రవి బెడ్ రూమ్ లో మంచి రసపట్టులో ఉన్న సమయంలో సునీల్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. భార్య దీపా తన స్నేహితుడు రవితో నగ్నంగా కనపడటంతో సునీల్ రగిలిపోయి కర్ర తీసుకుని ఇద్దరిని చితకబాదేశారు. ఆ సందర్బంలో సునీల్ చేతిలో ఉన్న కర్ర లాక్కొన్న అతని భార్య దీపా, ఆమె ప్రియుడు ఎదురుదాడి చేశారు.
శవం సంచిలో మూటకట్టి ఏం చేశారంటే ?
సునీల్ తల మీద కర్రతో బలంగా దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు పోయాయి. తరువాత సునీల్ బతికిపోతాడు అనే భయంతో అతని ముఖానికి ప్లాస్టిక్ కరవ్ చుట్టి టైట్ గా బిగించారు. రెండు రోజులు శవాన్ని ఇంట్లో పెట్టారు. తరువాత గోనే సంచిలో దీపా ఆంటీ ఆమె భర్త సునీల్ శవం భద్రంగా కట్టేసి తీసుకెళ్లి మోడీ నగర్ సమీపంలోని జగత్ పూరి దగ్గర పొలంలో విసిరేసి వెళ్లిపోయారు.
అడ్డంగా చిక్కిపోయిన కిలాడీ ఆంటీ
పొలంలో శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదట శవం ఎవరిది అని పోలీసులు గుర్తించలేకపోయారు. పోస్టుమార్టం నివేదికలో ఆ వ్యక్తిని హత్య చేశారని వెలుగు చూసింది. తరువాత ఘాజియాబాద్ లో నివాసం ఉంటున్న మేస్త్రీ సునీల్ హత్యకు గురైనాడని గుర్తించిన పోలీసులు మొత్తం బయటకు లాగేశారు.
నేరం అంగీకరించిన కంత్రీ ఆంటీ
సునీల్ భార్య దీపా మీద అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశామని, ప్రియుడు రవితో కలిసి తన భర్త సునీల్ ను హత్య చేశానని దీపా అంగీకరించిందని ఘాజియాబాద్ రూరల్ అడిషనల్ పోలీసు కమీషనర్ ఇరాజ్ రాజా స్థానిక మీడియాకు చెప్పారు. సునీల్ ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టేసి, సింపుల్ గా శవం గోనే సంచిలో మూటకట్టి తీసుకెళ్లి పొలంలో విసిరేసి చేతులు దులుపుకోవాలని అనుకున్న దీపా, ఆమె ప్రియుడు రవి స్కెచ్ రివర్స్ కావడంతో ఇద్దరిని ఘాజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.