Illegal affair: నేరుగా ఇంటికే వస్తున్న ప్రియుడు, పెళైన ఆరు నెలలకే, భర్త స్కెచ్ తో ఫినిష్!
లక్నో/ఉత్తరప్రదేశ్: బంధువులు వెతికిపెట్టిన యువతిని యువకుడు వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న భర్త ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. దంపతులతో పాటు భర్త తల్లిదండ్రులు వారితోనే నివాసం ఉంటున్నారు. భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య గంటలు గంటలు ఫోన్ లో ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. ఓ సారి భార్య వేరే యువకుడితో అభ్యంతరకరమైన రీతిలో ఉన్న విషయాన్ని చూసిన భర్త పెద్దగా పట్టించుకోలేదు.
ఆ రోజు తాను నా ప్రియుడితో బెడ్ రూమ్ లో ఉన్నా నా భర్త ఇంత వరకు ఏమీ పట్టించుకోలేదని, నేను నా ప్రియుడితో తిరిగితే నా భర్త తనను ఏమీ చెయ్యాలేడని అనుకున్న భార్య ఇంకా బరితెగించింది. చట్టుపక్కల వాళ్లు, స్థానికులకు భార్య అక్రమ సంబందం విషయం తెలిసిపోయి అందరూ ఆమె భర్తను జోకర్ లా చూసి ఎగతాలి చేశారు. అంతే భర్తకు ఎక్కడా కాలిపోయి అతని తండ్రి సహాయంతో ప్రియుడిని పిలిపించి చంపేశాడు. శవాన్ని బైక్ కు కట్టేసి చెట్టును ఢీకొట్టి అతను ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించిన భర్త చేతులు దుపులుకున్నాడు. ప్రియుడిని హత్య చేసిన వ్కక్తితో పాటు అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పెళైన ఆరు నెలలకే మహిళ చేసిన పనికి ప్రియుడు హత్యకు గురి కావడం, ఆమె భర్త, మామ జైలుకు పోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Lady MLA: లేడీ ఎమ్మెల్యే అసభ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్, కేసు పెట్టిన లేడీ లీడర్, ఆ వీడియో!
ఆరు నెలల క్రితం పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బంధువులు వెతికిపెట్టిన అందమైన స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని ఇదే సంవత్సరం మే నెలలో రాకేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత రాకేష్, స్వప్నా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.
ఇంట్లో తల్లిదండ్రులు
రాకేష్ సొంత ఇంటిలోనే స్వప్నా కాపురం ఉంటోంది. రాకేష్, స్వప్నా దంపతులతో పాటు అతని తల్లిదండ్రులు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత రాకేష్ అతని భార్య స్వప్నాను పిలుచుకుని బైక్ లో షికార్లకు తిరిగాడు. స్వప్నా బంధువులు అందరి ఇళ్ల కు రాకేష్ వెళ్లి వస్తున్నాడు.
గంటలు గంటలు భార్య ప్రియుడితో ?
వ్యాపారం చేస్తున్న రాకేష్ ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. రాకేష్, స్వప్నా దంపతులతో పాటు భర్త తల్లిదండ్రులు వారితోనే నివాసం ఉంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. భర్త రాకేష్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య స్వప్నా మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని గంటలు గంటలు ఫోన్ లో ఆమె ప్రియుడు మోహిత్ అనే యువకుడితో మాట్లాడుతోంది.
రెడ్ హ్యాండెడ్ గా చూసి సైలెంట్ గా ఉండిపోయిన భర్త
రెండు నెలల క్రితం ఓ సారి భర్త రాకేష్ తో పాటు అతని తల్లిదండ్రులు అందరూ బయటకు వెళ్లారు. ఆ సమయంలో స్వప్నా ఆమె ప్రియుడు మోహిత్ ను ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో ఉంది. అదే సమయంలో ఇంట్లోకి వెళ్లిన రాకేష్ అతని భార్య స్వప్నా పరాయి మగాడు అయిన మోహిత్ తో కలిసి అభ్యంతరకరమైన రీతిలో ఉన్న విషయాన్ని చూసి సైలెంట్ గా ఉండిపోయి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
బరితెగించిన భార్య
నా ప్రియుడు మోహిత్ తో బెడ్ రూమ్ లో ఉన్నా నా భర్త రాకేష్ నన్ను ఇంత వరకు ఏమీ ప్రశ్నించలేదని, ఆయన ఆ విషయం పట్టించుకోలేదని, నేను నా ప్రియుడితో తిరిగితే నా భర్త తనను ఏమీ చెయ్యాలేడని అనుకున్న స్వప్నా ఇంకా బరితెగించింది. అయితే మోహిత్ విషయంలో స్వప్నాను రాకేష్ తల్లిదండ్రులు మందలిస్తూనే ఉన్నారని తెలిసింది.
భర్తను జోకర్ లా చూసిన స్థానికులు
స్వప్నా విషయం తెలిసినా ఆమెను రాకేష్ ఏమి చెయ్యలేకపోతున్నాడని స్థానికులకు తెలిసిపోయింది. చట్టుపక్కల వాళ్లు, స్థానికులకు రాకేష్ భార్య స్వప్నా అక్రమ సంబందం విషయం తెలిసిపోయింది. స్థానికులు చాలా మంది స్వప్నా భర్త రాకేష్ ను జోకర్ లా చూసి ఎగతాలి చేశారు. రాకేష్ కనపడిన ప్రతిసారి అతన్ని పరోక్షంగా నువ్వు మగాడివేనా ? అంటూ సూటిపోటి మాటలు మాట్లాడారు.
ప్రియుడిని చంపేసిన భర్త, తండ్రి
చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలతో రాకేష్ కు ఎక్కడో కాలిపోయి అతని తండ్రి సహాయంతో ప్రియుడు మోహిత్ ను చంపేయాలని డిసైడ్ అయ్యారు. అంతే మోహిత్ తో మాట్లాడాలని చెప్పిన రాకేష్ అతని తండ్రి సీతాపూర్ ఊరి బయటకు పిలిపించారు. తరువాత రాకేష్ అతని తండ్రి కలిసి కత్తులు తీసుకుని మోహిత్ గొంతు కోసి దారుణంగా చంపేశారు. తరువాత మోహిత్ శవాన్ని అతని బైక్ కు కట్టేసి సీతాపూర్-గోలాపూర్ రహదారిలోని మలుపు దగ్గర చెట్టును ఢీకొట్టి అతను ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించి చేతులు దుపులుకున్నారు.
ఫోన్ చేసి పిలిపించారు
పోలీసుల విచారణలో మోహిత్ ను రాకేష్ ఫోన్ చేసి పిలిపించాడని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసుల విచారణలో మోహిత్ ను తామే హత్య చేశామని రాకేష్, అతని తండ్రి అంగీకరించారని, ఇద్దరిని అరెస్టు చేశామని సుల్తాన్ పూర్ పోలీసు అధికారి రాజేష్ సింగ్ మీడియాకు చెప్పారు. అక్రమ సంబంధం కారణంగానే మోహిత్ హత్యకు గురైనాడని పోలీసులు అన్నారు.