Illegal affair: అర్దరాత్రి భార్య ఫోన్ పంచాయితీ, విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే, అన్నం, నీళ్లు కూడా, అంతే !
కాన్పూర్/ లక్నో: వ్యాపారం చేస్తున్న భర్త ఎక్కువగా బయట ఉంటున్నాడు. వ్యాపారం ముగించుకుని ఇంటికి వెలుతున్న భర్తకు అతని భార్య మొదట్లో బాగా చూసుకునేది. రానురాను భార్య ఆమె భర్తను పట్టించుకోవడం మానేసింది. వ్యాపారం ముగించుకుని ఇంటికి వెలుతున్న భర్త భోజనం పెట్టమని అడిగితే వంటగదిలో అన్నం ఉంది పెట్టుకుని తిను అని నిర్లక్షంగా చెప్పింది. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా భర్తను నిర్లక్షం చేసింది. భర్త భోజనం చేస్తున్నా సరే, పడుకున్నా సరే అతని భార్య మాత్రం ఆమె ప్రియుడితో మొబైల్ ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడటం, చాటింగ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి పెద్దగా గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని అతని భార్య గొంతు కోసేయడం కలకలం రేపింది.
Sri Lanka: దేశం వదిలి షిప్ లో పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు ?, కనపడితే కొట్టి చంపేస్తారని రిపోర్ట్ !
రెండు సంవత్సరాల క్రితం పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లోని వజీర్ గంజ్ లోని పూర్వా ప్రాంతంలో సందీప్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన ఉషా (26) అనే యువతిని సందీప్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన సంవత్సరం పాటు సందీప్, ఉషా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.
వ్యాపారం చేస్తున్న భర్త
సందీప్ ఉన్నావ్ లో చిన్న వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న సందీప్ ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఉంటున్నాడు. వ్యాపారం ముగించుకుని రాత్రి ఇంటికి వెలుతున్న సందీప్ ను అతని భార్య ఉషా మొదట్లో బాగా చూసుకునేది. రానురాను ఉషా ఆమె భర్త సందీప్ ను పట్టించుకోవడం మానేస్తూ వచ్చింది.
ప్రియుడితో ఫోన్ లో భార్య ఫుల్ బిజీ
వ్యాపారం చేస్తున్న భర్త సందీప్ బయట బిజీగా ఉంటే కొన్ని నెలల క్రితం ప్రియుడిని సెట్ చేసుకున్న అతని భార్య ఉషా ఇంకా బిజీ అయిపోయింది. వ్యాపారం ముగించుకుని ఇంటికి వెలుతున్న సందీప్ భోజనం పెట్టమని అతని భార్య ఉషాను అడిగితే వంటగదిలో అన్నం ఉంది పెట్టుకుని తిను అని ఆమె నిర్లక్షంగా సమాధానం చెప్పేది.
ఫోన్ లో మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చిన భర్త
కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా సందీప్ ను నిర్లక్షం చేసి ఉషా ఆమె ప్రియుడితో ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడేది. సందీప్ భోజనం చేస్తున్నా సరే, పడుకున్నా సరే అతని భార్య ఉషా మాత్రం మొబైల్ ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడటం, చాటింగ్ చెయ్యడం మొదలుపెట్టింది. నువ్వు ఫోన్ లో బయట వ్యక్తులతో మాట్లాడకూడదని, చాటింగ్ చెయ్యకూడదని కొంతకాలం నుంచి సందీప్ అతని భార్య ఉషాతో గొడవపడుతున్నాడు.
భార్య గొంతు టమోటో కోసినట్లు కోసేసిన భర్త
మొబైల్ ఫోన్ లో ప్రియుడితో మాట్లాడకూడదు అనే విషయంలో సందీప్, ఉషా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి రెండు గంటల పాటు సందీప్, ఉషాల మద్య పెద్దగా గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన సందీప్ కత్తి తీసుకుని అతని భార్య ఉషా గొంతును టమోటో కోసినట్లు కోసేశాడు.
మ్యాటర్ మొత్తం చెప్పిన భర్త
భార్య ఉషాను హత్య చేసిన సందీప్ పారిపోకుండా అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఉన్నావో పోలీసులు సందీప్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం అనుమానంతో సందీప్ అతని భార్య ఉషా గొంతు కోసేసి చంపేయడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. తన భార్య ఉషా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని చంపేశానని సందీప్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.