చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి వృద్దురాలికి చికిత్స చేసిన మంత్రి, ప్రజాసేవ ముఖ్యం, అధికారం !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు, శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీలతో పాటు ఎన్నికల బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి జయకుమార్ ప్రమాదానికి గురైన మహిళకు చికిత్స చేసి ఓటర్లను ఆకర్షించారు.

<strong>నాయుడు కులం అడ్డం పెట్టుకుని సుమలతతో రాజకీయాలు, సిగ్గుగా ఉంది, మంత్రి ఫైర్!</strong>నాయుడు కులం అడ్డం పెట్టుకుని సుమలతతో రాజకీయాలు, సిగ్గుగా ఉంది, మంత్రి ఫైర్!

చెన్నైలో మంత్రి జయకుమార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మంత్రి జయకుమార్ ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రాంతంలోనే ఓ వృద్దురాలు రోడ్డు ప్రమాదానికి గురైయ్యింది. విషయం తెలుసుకున్న మంత్రి జయకుమార్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టారు.

In Chennai Campaign Minister (Tamil Nadu) Jayakumar made the First aid to the Old Woman in the accident.

వెంటనే ప్రమాదానికి గురైన వృద్దురాలి దగ్గరకు వెళ్లి ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. తరువాత అంబులెన్స్ కు ఫోన్ చేసిన మంత్రి జయకుమార్ వృద్దురాలిని ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారం కంటే ప్రజాసేవే ముఖ్యమని మంత్రి జయకుమార్ నిరూపించారని అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

వృద్దురాలికి ప్రథమ చికిత్స చేసిన మంత్రి జయకుమార్ ఓటర్లను ఆకర్షించారు. మంత్రి జయకుమార్ వృద్దురాలికి ప్రథమ చికిత్స చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిత్యం ప్రతిపక్షాల మీద విరుచుకుపడి వార్తల్లో ఉండే మంత్రి జయకుమార్ ఇప్పుడు ఈ విదంగా మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.

English summary
In Chennai Campaign Minister (Tamil Nadu) Jayakumar made the First aid to the Old Woman in the accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X