RTC బస్సుల్లో 100 కోట్ల ప్రయాణాల మార్క్..ఫ్రీ జర్నీతో మహిళలు దుమ్ము లేపారు..!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఐదు ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేసిన శక్తి పథకంలో భాగంగా కర్ణాటకలోని మహిళలకు ఉచితంగా ఆర్ టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టి ఐదు నెలలు పూర్తయింది.
జూన్ 11వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు కోట్లాది మంది మహిళలు ఉచితంగా కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కర్ణాటకకు చెందిన నాలుగు కార్పొరేషన్ల బస్సుల్లో ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మహిళలు శక్తి పథకం ద్వారా లబ్ధి పొందారని, శక్తి పథకం అమలులోకి వచ్చిన ఐదు నెలల్లో రూ.2, 397 కోట్లు సిద్దరామయ్య ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఉచిత బస్సు పథకం కింద 100 కోట్లకు పైగా ప్రయాణాల మార్కును విజయవంతంగా నడిపింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం

మరికొద్ది రోజుల్లోనే మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి సిద్దరామయ్య ప్రభుత్వానికి రూ 2, 500 కోట్ల రూపాయలకు ఖర్చు అవుతోందని తెలిసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జూన్ 11వ తేదీన మొదటి హామీ పథకంగా శక్తి పథకం అమలు చేశారు. విధానసౌధ ఎదుట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు.

శక్తి గ్యారంటీ పథకాన్ని కర్ణాటక సీఎం సిద్దారమయ్య జూన్ 11 న ప్రారంభించగా, 160 రోజుల్లోనే 100,47,56,184 ప్రయాణాలు దాటడం విశేషం. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళా ప్రయాణికుల మొత్తం టికెట్ విలువ రూ. 2, 397 కోట్లకు చేరుకుంది.
పథకం ప్రారంభించిన మొదటి నెల అంటే జూన్లో అత్యధిక సంఖ్యలో మహిళా ప్రయాణికులు 10,54,45,047 మంది ఉన్నారు. జూలైలో ఈ సంఖ్య 19,63,00,625 వద్ద స్వల్పంగా తగ్గి ఆగస్టులో మళ్లీ పెరిగి 20,03,60,680కి చేరుకుంది. సెప్టెంబర్లో 18,95,49,754 మంది ప్రయాణికులు పథకం ప్రయోజనాలను పొందారు. గత నెలలో రాష్ట్రంలో 18,26,17,460 మంది లబ్ధిదారులు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications