గుల్బర్గ్ నరమేధం: బిజెపి కార్పొరేటర్తోపాటు 24మంది దోషులు(పిక్చర్స్)
అహ్మదాబాద్: గోద్రా అల్లర్ల తదుపరిరోజు చోటు చేసుకున్న గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ గత ప్టెంబరు 22న పూర్తయిన సంగతి తెలిసిందే.
వీహెచ్పీ నేత అతుల్ వైద్య సహా 24మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా ప్రకటించింది. మరో 36 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మొత్తం 66 మంది నిందితుల్లో ఐదుగురు మృతి చెందగా, ఒకరు అదృశ్యమయ్యారు.
కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. వీరిలో 9మంది 14ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. 2002లో చోటు చేసుకున్న ఈ నరమేధంలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జఫ్రీ సహా 69 మంది మృత్యువాత పడ్డారు.
గుల్బర్గ్ నరమేధం: బిజెపి కార్పొరేటర్తోపాటు 24మంది దోషులు ఇది ఇలా ఉండగా, కోర్టు తీర్పుపై ఇషాన్ సతీమణి జాక్రి జాఫ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతామని అన్నారు. కాగా, దోషులుగా తేలినవారిలో బిజెకి చెందిన కార్పొరేటర్ బిపిన్ పటేల్ ఒకరు. ఈ సంఘటనపై 2002లో ఛార్జ్షీట్ దాఖలుకాగా సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. సంఘటన జరిగిన 14 సంవత్సరాలకు తీర్పు వెలువడింది.
గుల్బర్గ్ నరమేధం కేసు
గోద్రా అల్లర్ల తదుపరిరోజు చోటు చేసుకున్న గుల్బర్గ్ సొసైటీ మారణకాండపై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ గత ప్టెంబరు 22న పూర్తయిన సంగతి తెలిసిందే.
గుల్బర్గ్ నరమేధం కేసు
వీహెచ్పీ నేత అతుల్ వైద్య సహా 24మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా ప్రకటించింది. మరో 36 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
గుల్బర్గ్ నరమేధం కేసు
మొత్తం 66 మంది నిందితుల్లో ఐదుగురు మృతి చెందగా, ఒకరు అదృశ్యమయ్యారు. కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది.
గుల్బర్గ్ నరమేధం కేసు
వీరిలో 9మంది 14ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. 2002లో చోటు చేసుకున్న ఈ నరమేధంలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జఫ్రీ సహా 69 మంది మృత్యువాత పడ్డారు. కాగా, దోషులుగా తేలినవారిలో బిజెకి చెందిన కార్పొరేటర్ బిపిన్ పటేల్ ఒకరు.