అయ్యో.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లిచేసుకున్న ప్రియురాలు..
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకర్నొకరు విడదీయలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. ప్రియుడే సర్వస్వం అని భావించింది ఆ యువతి. అతడితోనే ఏడడుగులు నడవాలని భావించింది. జీవితాంతం అతడితోనే గడపాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె కలల్ని ఆ కుటుంబసభ్యులు ఛిద్రం చేశారు. తమ కుమార్తె ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో అతడ్ని యువతి తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారు. అయితే తనతోనే జీవితం అనుకున్న ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రియుడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. అంతేకాక ఇక ప్రియుడి ఇల్లే తన ఇల్లు అని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా జునాఘంజ్ లో విషాదకరమైన ఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తిని.. యువతి తండ్రి, సోదరుడు దారుణంగా హత్య చేశారు. తమ కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే తమ స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదని తలచిన ఆ యువతి ప్రియుడి ఇంటికి బోరున విలపిస్తూ చేరుకుంది. ప్రియుడి మృతదేహం ముందు విలపించింది. మృతదేహానికి బొట్టు, పసుపు పెట్టి వివాహం చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని కలచివేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ విషాదకరమైన ఘటన గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగింది. నాందేడ్ జిల్లాలోని ఓల్డ్ గంజ్ ప్రాంతంలో జరిగింది. సాక్షమ్, అంచల్ ఇద్దరూ ప్రేమించుకోగా.. అది జీర్ణించుకోలేని తండ్రి.. సాక్షమ్ ను దారుణంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గంటల వ్యవధిలోనే నిందుతులను పట్టుకున్నారు. హత్యకు కొన్ని గంటల ముందు యువతి తల్లి.. యువకుడి ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక అంచల్ మాట్లాడుతూ.. తామిద్దరం మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. సాక్షమ్ మృతి చెందినా తాను అతడి భార్యగానే ఉంటానని తెలిపింది. సాక్షమ్ వేరే కులం వాడు కావడం వల్లే తమ తల్లిదండ్రులు ఇలా చేశారని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications