వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐటి ఝలక్: బినామీ యాక్ట్ కింద 87 నోటీసులు, రూ.42 కోట్లు అటాచ్
అదాయపన్ను శాఖ మళ్లీ కొరడా ఝుళిపించింది. బినామీ బాబులకు ఝలక్ ఇచ్చింది. వారి భరతం పట్టే దిశగా చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా కొందరికి నోటీసులు పంపించడమే కాక మరికొందరి నుంచి డిపాజిట్లు స్వాధీనం చేసుక
న్యూఢిల్లీ: అదాయపన్ను శాఖ మళ్లీ కొరడా ఝుళిపించింది. బినామీ బాబులకు ఝలక్ ఇచ్చింది. వారి భరతం పట్టే దిశగా చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా కొందరికి నోటీసులు పంపించడమే కాక మరికొందరి నుంచి డిపాజిట్లు స్వాధీనం చేసుకుంది.
నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా 2016 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన బినామీ లావాదేవీల చట్టాన్ని తాజాగా అదాయపన్ను శాఖ బయటికి తీసింది. ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా 87 నోటీసులు పంపినట్లు, రూ.42 కోట్ల డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
నోట్ల రద్దు తరువాత పెద్ద మొత్తంలో నల్లధనం తాలూకు సొమ్ము బినామీ ఖాతాలు, జన్ ధన్ ఖాతాలలో జమ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిక మొత్తాలు జమ అయిన ఖాతాలను జల్లెడ పట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఐటి అధికారులు పేర్కొన్నారు.
Comments
English summary
The income tax department has started cracking down on those with "benami" assets, issuing notices in 87 cases and attaching 42 properties, including those allegedly linked to a retired bureaucrat, a paper mill owner and people associated with an education trust in south India.
Story first published: Tuesday, January 31, 2017, 15:52 [IST]