ముఖ్యమంత్రి, మాజీ సీఎం, మంత్రులు మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఐటీ శాఖ, అంతే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి డీకే. శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మా విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
కొంత కాలం క్రితం కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ శాఖ దాడులు చేసిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, మంత్రి డీకే. శివకుమార్ తదితరులు ఐటీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో మా విధులకు ఆటంకం కలిగిందని ఆదాయపన్ను శాఖ అధికారులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్చి 28వ తేదీన మంత్రి పుట్టరంగశెట్టితో సహ పలువురు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రితో సహ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంగళూరు నగరంలోని క్వీన్స్ రోడ్డు సమీపంలోని ఐటీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఐటీ శాఖ దాడులు చేసిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, మంత్రులు డీకే. శివకుమార్, ఆర్. మహేష్, రామలింగా రెడ్డి తదితర రాజకీయ పార్టీ నాయకులు మా విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలలో ఆదాయపన్ను శాఖ చులకన అయ్మే విదంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఐటీ శాఖ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications