సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే
న్యూఢిల్లీ: భారత్లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది.
వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సరోగసిని భారతీయులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు కాదని స్పష్టం చేసింది.

మానవ పిండాల దిగుమతిపై కూడా నిషేధం విధించనుంది. కేవలం పరీక్షల కోసమే వీటిని అనుమతిస్తారు. అద్దె గర్భాల వ్యాపారం, మానవ పిండాల దిగుమతికి భారత్ మూల కేంద్రమైంది. పరీక్షల కోసమంటూ మానవ పిండాలను దిగుమతి చేసుకుంటున్న కొందరు వైద్యులు చట్టవ్యతిరేకంగా సరోగసిని ప్రోత్సహిస్తున్నారు.
సంతానం కోసం విదేశీయులు భారత్కు క్యూకట్టడంతో అద్దె గర్భం వ్యాపారమయంగా మారింది. దీనిపై స్పందించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి రెండు వారాల కిందట సూచించి, అక్టోబర్ 28 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం ఈమేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications