కేంద్రం నెత్తిన మరో పిడుగు.. తగ్గిన ట్యాక్స్ కలెక్షన్స్.. 20 ఏళ్లలో తొలిసారిగా..
గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయపు పన్ను,కార్పోరేట్ పన్ను ఆదాయం గణనీయంగా పడిపోనుందని సీనియర్ ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థికమందగమనం, పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

ట్యాక్స్ వసూళ్లు తగ్గడానికి కారణమేంటి..
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.13.5లక్షల కోట్లు సమకూరాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. గతంతో పోలిస్తే 17శాతం ఎక్కువ ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే మార్కెట్లో పడిపోయిన డిమాండ్ రీత్యా చాలా కంపెనీల బిజినెస్ తగ్గిపోయింది. దీంతో చాలావరకు కంపెనీలు పెట్టుబడులను తగ్గించుకోవడం,ఉద్యోగాలకు కోత పెట్టడం చేస్తున్నాయి. ఫలితంగా ట్యాక్స్ వసూళ్లు తగ్గిపోవడమే గాక.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 5శాతం వృద్దిని మాత్రమే అంచనా వేయాలని ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. గడిచిన 11 ఏళ్లలో ఇదే అతి తక్కువ ఆర్థిక వృద్ది రేటు కావడం గమనార్హం.

గతేడాది కంటే తక్కువ వసూళ్లు..
జనవరి 23వ తేదీ నాటికి ట్యాక్స్ డిపార్ట్మెంట్ వసూలు చేసిన మొత్తం ట్యాక్స్ రూ.7.3లక్షల కోట్లు. గతేడాది ఇదే సమయానికి వసూలైన మొత్తం కంటే ఇది 5.5శాతం తక్కువని సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. మొదటి మూడు త్రైమాసికాలకు కంపెనీల నుంచి ముందే పన్ను వసూళ్లు చేపట్టిన తర్వాత.. సాధారణంగా చివరి మూడు నెలల్లో 30-35% వార్షిక ప్రత్యక్ష పన్ను వసూలు అవుతుందని డేటా చెబుతోంది. కానీ తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.11.5లక్షల కోట్లు తగ్గేలా ఉందని ఎనిమిది మంది సీనియర్ ట్యాక్స్ అధికారులు రాయిటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కొత్త అప్పులు చేయాల్సిందేనా..
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సంగతి పక్కనపెడితే.. ఎన్నడూ లేని రీతిలో ట్యాక్స్ వసూళ్లు పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10శాతం కంటే తక్కువ ట్యాక్స్ వసూళ్లతో ముగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు ఢిల్లీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 80శాతం రెవెన్యూ పన్నుల రూపంలోనే అందుతుంది. కానీ ఈసారి పన్ను వసూళ్లు తగ్గిపోవడంతో.. ప్రభుత్వం కొత్తగా మరిన్ని అప్పులు చేసే అవకాశం ఉంది.

అధికారులు ఏమంటున్నారు..
ఆర్థిక మందగమనం నేపథ్యంలో గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పోరేట్ ట్యాక్స్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం పన్ను వసూళ్లపై ప్రభావం చూపిందంటున్నారు. పన్ను వసూళ్లు తగ్గడానికి అది కూడా ఓ ముఖ్య కారణమని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించినట్టగా కాకుండా.. కనీసం గతేడాది వచ్చిన ఆదాయమైనా సమకూరితే బాగుంటుందని ట్యాక్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
-
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications