అంతరిక్షంలో సత్తా చాటిన భారత్, నాల్గో స్పేస్ పవర్గా అవతరణ
Recommended Video

ఢిల్లీ : అంతరిక్షంలో భారత్ సత్తా చాటింది. ప్రపంచంలో మరో స్పేస్ పవర్గా అవతరించింది. అంతరిక్షంలో లైవ్ శాటిలైట్ ను పేల్చివేసిన భారత్.. అమెరికా, చైనా, రష్యా తర్వాత నాల్గో స్పేస్ పవర్గా అవతరించింది. భారత సైంటిస్టులు అంతరిక్షంలో 300కిలోమీటర్ల దూరంలో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లైవ్ శాటిలైట్ ను విజయవంతంగా కూల్చివేశారని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతం చేసిన సైంటిస్టులకు ఆయన అభినందనలు చెప్పారు.
దేశానికి గర్వకారణం
శాటిలైట్ పేల్చివేతకు సంబంధించిన వివరాలు పంచుకునేందుకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ ప్రయోగంతో నింగి, నేల, నీటితో పాటు అంతరిక్షం నుంచి జరిగే దాడులను కూడా ఎదుర్కొనే సత్తా భారత్ సొంతమైందని చెప్పారు. ఈ ప్రయోగం ఎవరినీ భయపెట్టేందుకు చేసింది కాదని మోడీ స్పష్టం చేశారు.
శత్రుదేశాలకు హెచ్చరిక
ఎల్ఈఓ శాటిలైట్ను పేల్చివేయడంలో విజయం సాధించిన భారత్ శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భారతపై నిఘా పెట్టే ఇతర దేశాల శాటిలైట్లను కూల్చడంతో పాటు వారి కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది ధ్వంసం చేయనుంది.

-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications