నవరాత్రుల్లో తేజస్ రైళ్లు.., ఆక్టోబర్ 4 ప్రారంభం..?

భారత దేశంలో మొదటి సారి ప్రవేశపెట్టిన ప్రవైట్ తేజస్ రైళ్లను నవరాత్రుల సంధర్భంలో ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలనే ఆక్టోబర్ 4 తేజస్ ప్రవైట్ రైలు సేవలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.తేజస్ రైల్లో విమాన తరహా సౌకర్యాలతో పాటు రైల్‌హోస్టులు, ఉండనుండగా, విమానప్రయాణికుల వలే పదిహేను రోజుల ముందుగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.

దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రైళ్లు ఆక్టోబర్ 4 నుండి ప్రారంభించనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నవరాత్రుల సంధర్భంగా ప్రారంభం కానున్న తేజస్ రైళ్లను ఢిల్లీ-లక్నోతోపాటు అహ్మాదాబాద్-ముంబయి మార్గాల్లో మొదటి ప్రైవేట్ రైళ్లు ప్రారంభించనున్నారు. కాగా వీటీని ఐఆర్‌సీటిసి ద్వార నడిపేందుకు ఇప్పటికే సన్నాహాలు జరిగాయి. ఈ రైళ్ల కోసం ప్రత్యేక మార్గాలను కూడ నిర్మించేందుకు కేంద్రం యోచిస్తోంది.

India’s first private train run will start its first operation during Navratris,

మరోవైపు ప్రైవేట్ రైళ్లలో అత్యాధునికమైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఎయిర్ హెస్టెస్‌ల వలే రైల్లో కూడ ప్రయాణికుల సర్వీసు కోసం రైల్వే హోస్టెస్‌లను కూడ నియమించనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రత్యేక లాంజ్‌లను కూడ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు రైళ్లలో ప్రీమియం క్లాస్‌ ఏర్పాట్లు చేయనున్నారు. తేజస్ రైళ్ల మెయింటనెన్స్‌ను ఐఆర్‌సీటీసి చేపట్టినప్పటికి రైళ్ల పూర్తి నిర్వహాణ అనగా లోకోపైలట్లు ఇతర ఉద్యోగుల వ్యవహారాలను రైల్వేశాఖ నిర్వహించనుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపడానికి ఐఆర్‌సిటిసి భారత రైల్వేకు భారీగా ఛార్జీలు చెల్లించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+