భారత తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కన్నుమూత
ముంబై: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలిసారి మహిళా ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించిన అన్నా రాజమ్ మల్హోత్రా(91) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం ఆమె తుది శ్వాస విడిచారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 1927, జులైలో అన్నా రాజమ్ జన్మించారు. కోజికోడ్లో ప్రాథమిక విద్యను, ఆ తర్వాత మద్రాసులో ఉన్నత విద్యను అభ్యసించారు. 1951లో ఆమె సివిల్ సర్వీస్లో చేరి మద్రాస్లో విధులు నిర్వహించారు.

అప్పటి సీఎం సీ రాజగోపాలచారి ప్రభుత్వంలో రాజమ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1985-1990 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఆర్ఎన్ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకున్నారు.
మొదటిసారి హోసూరు సబ్ కలెక్టర్గా చేశారు. ఏడుగురు సీఎంల వద్ద ఆమె అధికారిగా చేశారు. 1982 ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ ప్రాజెక్టుకు ఇంఛార్జీగా వ్యవహరించారు. గుర్రపు స్వారీ, షూటింగ్లోనూ ఆమె శిక్షణ పొందారు. అన్నా రాజమ్ మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications