శ్రీలంకకు భారత్ చమురు సాయం-2.7 లక్షల మెట్రిక్ టన్నులు-పొరుగే ప్రధానమన్న జైశంకర్
ఆర్ధిక సంక్షోభం బారిన పడిన పొరుగుదేశం శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. ఇప్పటికే భారీ ఎత్తున ఆహారధాన్యాల్ని పంపుతున్న భారత్.. తాజాగా భారీగా చమురును కూడా పంపాలని నిర్ణయించింది. శ్రీలంకలో ప్రస్తుతం చమురు ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో భారీగా చమురును పంపడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టుకునే అవకాశం కల్పించాలని భారత్ నిర్ణయించింది.
భారత్ కు ఇరుగుపొరుగుదేశాలే ముఖ్యమని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం బారిన పడిన శ్రీలంకకు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల చమురును పంపాలని నిర్ణయించిట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. గత 24 గంటల్లో 36,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ శ్రీలంకకు డెలివరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. భారతదేశ సాయం కింద వివిధ రకాల ఇంధనం మొత్తం 2 లక్షల 70 వేల మెట్రిక్ టన్నులు దాటినట్లు తెలిపారు.

ఆర్ధిక సంక్షోభం బారిన పడకముందు శ్రీలంకలో భారీ పెట్టుబడులు పెట్టినట్లు నటించిన చైనా.. సంక్షోభం రాగానే మౌనంగా ఉండిపోయింది. అయితే గతంలో చైనా అండ చూసుకుని భారత్ కు షాకులిచ్చిన శ్రీలంక ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది. దీంతో అనివార్యంగా భారత్ కూడా పొరుగుదేశం శ్రీలంకను ఆదుకునేందుకు ముందుకొస్తోంది. తద్వారా పొరుగుదేశాలతో శత్రుత్వాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం భారత్ చేస్తున్న సాయంతో లంకలో పరిస్దితులు కాస్త మెరుగుపడుతున్నట్లు తెలుస్తోంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications