Bhargavastra: భార్గవాస్త్రాన్ని ప్రయోగించిన భారత్- సీజ్ ఫైర్ తర్వాత తొలిసారి..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేస్తున్న తరుణంలో పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ తో సాధించిన విజయాలతో పోలిస్తే కాల్పుల విరమణ పెద్ద విషయం ఏమీ కాదన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారత్ ఇవాళ మరో క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. దీనికి ఒడిశాలోని గోపాల్ పూర్ లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ వేదికైంది.
పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ కు డ్రోన్ల రూపంలో అతి పెద్ద చికాకు ఎదురైంది. ముఖ్యంగా భారత్ క్షిపణుల్ని ప్రయోగిస్తుంటే వాటిని తట్టుకోలేక టర్కీ తయారీ డ్రోన్ల సాయంతో దాడికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే వీటిని మన ఆయుధ రక్షణ వ్యవస్థలు దీటుగానే ఎదుర్కొని కూల్చేసాయి.. అయితే ఇలాంటి ముప్పుల్ని ఎదుర్కొనేందుకు భారత్ ఇవాళ భార్గవస్త్రాన్ని రంగంలోకి దించింది.

డ్రోన్ లతో పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందిచిన భార్గవాస్త్ర అనే కొత్త తక్కువ-ధర కౌంటర్-డ్రోన్ వ్యవస్థను ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థ యొక్క మైక్రో రాకెట్లను ఒడిశాలోని గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటించింది. హార్డ్ కిల్ మోడ్లో రూపొందించబడిన భార్గవాస్త్రకు 2.5 కి.మీ దూరంలో ఉన్న చిన్న, ఇన్కమింగ్ డ్రోన్లను గుర్తించి కూల్చే సామర్ధ్యం ఉంది.
#WATCH | A new low-cost Counter Drone System in Hard Kill mode 'Bhargavastra', has been designed and developed by Solar Defence and Aerospace Limited (SDAL), signifying a substantial leap in countering the escalating threat of drone swarms. The micro rockets used in this… pic.twitter.com/qM4FWtEF43
— ANI (@ANI) May 14, 2025
సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ కోసం మూడు పరీక్షలు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో జరిగాయని రక్షణ వర్గాలు తెలిపాయి. రెండు ప్రయోగాలు ఒక్కొక్కటిగా ఒక రాకెట్ను ప్రయోగించడం ద్వారా జరిగాయి. రెండు సెకన్లలోపు రెండు రాకెట్లను సాల్వో మోడ్లో ప్రయోగించడం ద్వారా మరో ప్రయోగం జరిగింది. ఎత్తైన ప్రాంతాలు సహా విభిన్న భూభాగాలలో సమర్ధంగా మోహరించడానికి రూపొందించబడిన ఈ వ్యవస్థ భారతదేశ సాయుధ దళాల ప్రత్యేక కార్యాచరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications