రానున్న ఐదు రోజులపాటు దేశంలోని ఈ ప్రాంతాల్లో ఎండలు తీవ్రం, వడగాలుల అలర్ట్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎండలు మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రానున్న ఐదు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వివిధ పనుల మీద బయటతిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాతావరణ శాఖ ప్రకారం.. ఏప్రిల్ నెల ప్రారంభంలో దేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38 నుంచి -40 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతోంది.
బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. వాతావరణ మార్పు ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతోందని, తీవ్రమైన వాతావరణ సంఘటనల ఫ్రీక్వెన్సీ, తీవ్రతను మరింత దిగజార్చుతోందని తెలిపారు.
5 days warning:
— India Meteorological Department (@Indiametdept) April 8, 2023
(i) Thunderstorms with gusty winds likely over Madhya Pradesh, Odisha, Maharashtra and Chhattisgarh during next 2 days and decrease thereafter.
(ii) Gradual rise in maximum temperature by 2-4°C over most parts of the country during next 5 days. pic.twitter.com/kHMsxq379U
ఐఎండీ ప్రకారం.. 1901లో రికార్డ్ కీపింగ్ ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం ఈ సంవత్సరం తన హాటెస్ట్ ఫిబ్రవరిని నమోదు చేసింది. అయితే, ఐదు బలమైన వాటితో సహా ఏడు పశ్చిమ అవాంతరాల కారణంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం మార్చిలో ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచిందని తెలిపింది. మరోవైపు, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ముందు వర్షం, ఉరుములు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications