అవినీతిలో భారత్ ఆసియాలోనే టాప్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన లేటెస్ట్ సర్వే...
ఆసియాలోనే అత్యంత అవినీతిమయ దేశంగా భారత్ నిలిచినట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించింది. భారత్లో 39శాతం అవినీతి జరుగుతున్నట్లు తెలిపింది. 46శాతం మంది వ్యక్తులు వ్యక్తిగత పరిచయాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ సేవలు పొందుతున్నట్లు పేర్కొంది. లంచం ఇచ్చినవారిలో దాదాపు 52శాతం మందిని వివరాలు అడగ్గా... 32శాతం మంది తమ వ్యక్తిగత పరిచయాలను అందుకోసం ఉపయోగించుకున్నట్లు తెలిపారు. లేదంటే పని జరగదని వారు పేర్కొనడం గమనార్హం.

గత 12 నెలల్లో 47శాతం అవినీతి...
గత 12 నెలల్లో భారత్లో అవినీతి పెరిగినట్లు 47శాతం మంది సర్వేలో అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అవినీతిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని 63శాతం మంది అభిప్రాయపడ్డారు. గ్లోబల్ కరప్షన్ బారోమీటర్-ఆసియా పేరుతో విడుదల చేసిన ఈ సర్వే కోసం ఆసియాలోని 17 దేశాల్లో దాదాపు 2లక్షల మంది నుంచి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అభిప్రాయాలు సేకరించింది. గడిచిన 12 నెలల్లో అవినీతితో వారికి ఎదురైన అనుభవాలకు సంబంధించిన వివరాలు సేకరించింది.

ఏయే వ్యవస్థల్లో
ఇందుకోసం ప్రధానంగా పోలీస్ వ్యవస్థ,ప్రభుత్వ ఆస్పత్రులు,ధ్రువీకరణ పత్రాలు,ఇతరత్ర సేవలకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంది. భారత్లో 42శాతం మంది ప్రజలు పోలీసులకు లంచాలు చెల్లిస్తున్నట్లు సర్వేలో వెల్లడించారు. అలాగే అధికారిక ధ్రువీకరణ పత్రాల కోసం లంచం చెల్లించిస్తున్నట్లు 41శాతం మంది చెప్పారు. ఈ ఏడాది జనవరిలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ఇదే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన సర్వేలో.. అవినీతి దేశాల్లో భారత్ 80వ స్థానంలో ఉంది.

బ్రైబరీ రిస్క్ జాబితాలో 77వ స్థానం..
ఇటీవల 'ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్' సంస్థ వెల్లడించిన బ్రైబరీ రిస్క్ జాబితాలో... 45 స్కోర్తో భారత్కు 77వ స్థానం దక్కింది. గతేడాదితో పోల్చితే భారత్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో.. అక్కడి వ్యాపార వ్యవహారాల్లో ముడుపుల ప్రభావాన్ని ఈ సంస్థ అంచనా వేస్తుంది.
ఈ విషయంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్,చైనా,నేపాల్,బంగ్లాదేశ్ల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. అయితే మన పక్కనే ఉన్న భూటాన్ మాత్రం భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. 37 స్కోర్తో ఆ దేశం బ్రైబరీ రిస్క్ జాబితాలో 48వ స్థానంలో నిలిచింది.జాబితాలో అత్యంత అట్టడుగున.. చివరిదైన 194వ స్థానంలో సోమాలియా నిలిచింది. 2017-2019లో ఆ దేశం 187వ ర్యాంకులో ఉండగా... ఇప్పుడు మరింత దిగజారింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications