పాకిస్తాన్ తో పాటు మరో శత్రువుతోనూ ఆర్మీ యుద్ధం ? ఏకకాలంలో..!
పహల్గాం దాడి తర్వాత ఉగ్రమూకల్ని, వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ముందు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన మన సైన్యం.. ఆ తర్వాత వారి క్షిపణి రక్షణ వ్యవస్థలను కుప్పకూల్చింది. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ బేస్ లపైనే దాడి చేస్తోంది. ఇదే ఊపులో మరికొన్ని రోజుల్లోనే యుద్ధం ముగించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది.
అయితే పాకిస్తాన్ పై ఓవైపు తీవ్ర స్ధాయిలో యుద్దం చేస్తున్న భారత త్రివిధ దళాలకు ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అదే నకిలీ వార్తలు. ఓవైపు కదనరంగంలో కాలు దువ్వుతూనే మరోవైపు ఈ ఫేక్ న్యూస్ పైనా దాడి చేయాల్సిన పరిస్ధితి ఆర్మీకి ఎదురవుతోంది. ఎందుకంటే శత్రువులతో తాము చేస్తున్న పోరాటంలో ఎలాగో విజయం తమదేనని మన బలగాలకు తెలుసు. అదే దైర్యంతో ఇప్పుడు దూకుడుగా మందుకెళ్తున్నారు కూడా. అయితే ఈ ఫేక్ న్యూస్ విషయంలోనే ఇబ్బందులు తప్పడం లేదు.

Heard of attack on Nagrota Air Base❓BEWARE‼️
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
An old and digitally altered video is being falsely circulated as footage of a Pakistani attack on the Nagrota Air Base.#PIBFactCheck
✅ This video was originally posted on Instagram in October 2024.
🔗 Watch:… pic.twitter.com/eO0o5njfRi
ముఖ్యంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్ తో పాటు వారి సానుభూతిపరులు వ్యాప్తి చేస్తున్న ఫేక్ న్యూస్ ఇప్పుడు ఆర్మీని చికాకు పెడుతోంది. అలాగని దీన్ని లైట్ తీసుకుంటే మన ప్రజలే దీన్ని నిజమని భావించి ఆందోళన చెందే ప్రమాదం ఉంది. దీంతో ఆర్మీ ఎప్పటికప్పుడు ఈ ఫేక్ న్యూస్ ను ఖండించేలా కచ్చితమైన ఆధారాలతో ముందుకొస్తోంది. తాజాగా భారత నగరాలు, విమానాశ్రయాలు, పౌరులపై, జవాన్లపై పాకిస్తాన్ దాడులు అంటూ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అలాగే పాకిస్తాన్ లో భారత బలగాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు కూడా మరికొన్ని ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
🚨Udhampur Air Base remains operational✅
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
A video aired by 'AIK News' on live TV claimed that Pakistan had destroyed the Udhampur Air Base.#PIBFactCheck
✅ This video shows a fire incident at a chemical factory in Hanumangarh, Rajasthan.
✅ It's unrelated to the current… pic.twitter.com/EIs0xXucXw
మరోవైపు పాకిస్తాన్ కూడా తప్పుడు సమాచారాన్ని బహిరంగంగానే వెల్లడిస్తోంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు, అధికారులు , సైన్యం కూడా బారత్ పై దాడి చేసినట్లు ఫేక్ న్యూస్ లు తెరపైకి తెస్తున్నారు. తద్వారా తమ పౌరుల్లో తమపై నమ్మకం పోకుండా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదంతా చివరికి భారత్ కు చికాకుగా మారుతోంది. దీంతో తాజాగా రక్షణ, విదేశాంగశాఖలు పక్కా ఆధారాలతో ఇలాంటి ఫేక్ ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
The recent claims made by Pakistan regarding the destruction of Indian military facilities, infrastructure, and the alleged missile attacks on Afghanistan are nothing but lies and propaganda. Allegations about the destruction of air force stations in Sirsa, Suratgarh, and the… pic.twitter.com/kzSfvd6LKs
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 10, 2025
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications