ఇండియన్ నేవీలో తొలి మహిళా పైలట్గా స్వరూప్, హైదరాబాద్లో శిక్షణ
ఇండియన్ నేవీలో తొలిసారి మహిళా పైలట్ ఎంపికయ్యారు. యూపీకి చెందిన సుభాంగి స్వరూప్ ఈ ఘనత సాధించారు. అంతేకాదు, ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది.
తిరువనంతపురం: ఇండియన్ నేవీలో తొలిసారి మహిళా పైలట్ ఎంపికయ్యారు. యూపీకి చెందిన సుభాంగి స్వరూప్ ఈ ఘనత సాధించారు. అంతేకాదు, ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది.
వీరు ఢిల్లీకి చెందిన ఆస్తా సెహగల్, పుదుచ్చేరికి చెందిన రూప, కేరళకు చెందిన శక్తిమాయ. నేవీలోని నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టోరేట్ (ఎన్ఏఐ) విభాగంలో వీరు ముగ్గురు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

కేరళలోను కన్నూరు జిల్లాలోని ఇండియన్ నావల్ అకాడమీలో నావల్ ఓరియెంటేషన్ పూర్తి చేసిన ఈ నలుగురు మహిళలకు నావల్ చీఫ్ అడ్మిరల్ సునీల్ పట్టాలు అందించారు. వీరు తర్ఫీదు పొందనున్నారు. ఉమెన్ పైలట్గా సుభాంగి స్వరూప్ హైదరాబాదులోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు.












Click it and Unblock the Notifications