బీజేపీ పాలనలో భారతీయుల మధ్య విభజన : మోదీపై రాహుల్ విసుర్లు
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించారన్నారు. ఒకటి ధనవంతుల దేశం కాగా.. మరొకటి పేదల దేశమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ రెండు దేశాల మధ్య విభజన నానాటికీ పెరిగిపోతుందని పేర్కొన్నారు. దేశానికి సంబంధించిన ధనమంతా ఒకరిద్దరి చేతుల్లోకి బందీ అయిపోయిందని విమర్శించారు. పేదలకు సరైన ఉద్యోగాలు కూడా లేవని మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం ధనికుల కోసమే పనిచేస్తుంది..
రాష్ట్రపతి ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం ధనికుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. వారికే అన్ని సదుపాయాలు అందుతున్నాయన్నారు. కానీ పేదలకు గురించి ఈ కేంద్ర ప్రభుత్వ ఆలోచించడం లేదని విమర్శించారు. వీరికి ఆపన్న హస్తం అందించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం వలన ఈ ధనిక, పేద దేశాల మధ్య విజభన నానాటికీ పెరుతోందని పేర్కొన్నారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎన్టీయే పాలనలో 23 కోట్ల మంది పేదరికంలోకి..
దేశంలో కేవలం 10 మంది ధనవంతుల వద్ద ఉన్న నగదు.. దేశంలోని 40 కోట్ల మంది ప్రజల ఆదాయంతో సమానం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రజల జీవన ప్రమాణాలు తారుమారైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి నిరుద్యోగ సమస్య ఎప్పుడూ తలెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ పాలనలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. కానీ, ఎన్డీయే హయంలో 23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారని మండిపడ్డారు.

రైతులు, నిరుద్యోగులు, పేదల పట్ల నిర్లక్ష్యం
బీజేపీ పాలనలో దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్లో రైతులు, నిరుద్యోగులు, పేదల గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. దేశంలోని యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంది. కానీ దాని గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలతో యువతను మోసం చేస్తుందని విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు కల్పించడంతో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు గుప్పించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను మోదీ ప్రభుత్వం విద్వంస చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications