ఓ అడుగు ముందే ఉన్న ఇండియా
న్యూఢిల్లీ: ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు. అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం లేదా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇవ్వాళ సమావేశమైన ఇండియా సమన్వయ కమిటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి- సీట్ల పంపకాలపైనా తుది నిర్ణయానికి వచ్చారు సమన్వయ కమిటీ సభ్యులు.
శరద్ పవార్- ఎన్సీపీ, కేసీ వేణుగోపాల్- కాంగ్రెస్, టీఆర్ బాలు- డీఎంకే, తేజస్వి సూర్య- ఆర్జేడీ, సంజయ్ రౌత్- శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సంజయ్ ఝా- జనతాదళ్ (యునైటెడ్), హేమంత్ సోరెన్- జార్ఖండ్ ముక్తి మోర్చా, రాఘవ్ ఛద్దా- ఆమ్ ఆద్మీ పార్టీ, డీ రాజా- సీపీఐ, ఒమర్ అబ్దుల్లా- నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ- పీడీపీ, జావెద్ అలీ- సమాజ్వాది పార్టీ.. ఇందులో పాల్గొన్నారు.
ఇందులో చర్చకు వచ్చిన అంశాల గురించి కేసీ వేణుగోపాల్ విలేకరులకు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు. సభ్య పార్టీల నేతలతో చర్చలు జరిపి, వీలైనంత త్వరగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు అభిప్రాయపడినట్లు చెప్పారు.
అక్టోబరు మొదటి వారంలో భోపాల్లో ఉమ్మడి మొదటి సభను నిర్వహించబోతోన్నామని అన్నారు. ఈ సభ- ఇండియా బ్లాక్ ఉమ్మడి అజెండాకు అద్దం పడుతుందని, అందులో ప్రస్తావనకు వచ్చే అంశాలన్నీ అందరి ఆమోదం పొందినవే అవుతాయని చెప్పారు. ఏ తేదీన సభ నిర్వహించాలనేది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications