షాక్: ఇన్సోసిస్ ను వీడిన 38 వేల మంది టెక్కీలు, కారణమిదే!..
ఇన్పోసిస్ లో ఇటీవల చోటుచేసుకొంటున్న పరిణామాలు ఆ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.దీంతో ఆ కంపెనీని ఇప్పటికే 38 వేల మంది టెక్కీలు వీడిపోయారు. ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకొన్నారు.
బెంగుళూరు: ఇన్పోసిస్ లో ఇటీవల చోటుచేసుకొంటున్న పరిణామాలు ఆ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.దీంతో ఆ కంపెనీని ఇప్పటికే 38 వేల మంది టెక్కీలు వీడిపోయారు. ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకొన్నారు.
ధేశీయంగా ఇన్పోసిస్ టాప్ ప్లేస్ లో ఉంది. దేశీయ ఐటీ కంపెనీల్లో టాప్ కంపెనీల్లో ఇన్పోసిస్ ఒకటి.అయితే ఇన్పోసిస్ లో నెలకొన్న పరిణామాలు ఆ సంస్థలో పనిచేస్తోన్న టెక్కీలపై ప్రభావం చూపుతున్నాయి.
ఇన్పోసిస్ వ్యవహరాలు ఇటీవల కాలంలో రచ్చకెక్కాయి.కంపెనీ వేతన విషయంలో నెలకొన్న లుకలుకలు, భారీగా తగ్గిపోతున్న రిక్రూట్ మెంట్ కంపెనీ పేరును దెబ్బతీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలు కూడ ఐటీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఈ ప్రభావం ప్రధానంగా భారత్ లోని ఐటీ పరిశ్రమలపై ఎక్కువగా ఉంది.

ఇన్సోసిస్ ను వీడిన 38 వేల మంది టెక్కీలు
2016-17 లో ఇన్పోసిస్ ను 38 వేల మంది టెక్కీలు వీడివెళ్ళిపోయారు.అదే ఏడాది రిక్రూట్ మెంట్ కూడ 65 శాతానికి పడిపోయింది.వేతనాలతో పాటు ఇతర అంశాలు కూడ ప్రధానంగా కారణంగా నిపుణులు అంచనావేస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఆటోమెషన్ ప్రధానకారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2015-16 లో ఈ కంపెనీ నుండి సుమారు 34,688 మంది రాజీనామా చేశారు.

కొత్తగా చేరింది 6 వేల మంది మాత్రమే
ఇన్పోసిస్ లో .2016-17 లో 44,235 మంది టెక్కీలను నియమించుకొంది.అయితే కంపెనీలోకి వచ్చింది మాత్రం కేవలం 6,320 మంది మాత్రమేనని ఇన్పోసిస్ వెల్లడించింది. పదేళ్ళకంటే ఎక్కువ అనుభవమున్న వారిని కూడ తక్కువ సంఖ్యలోనే చేర్చుకొన్నారు.కేవలం18,797 మందిని మాత్రమే చేర్చుకొన్నారని ఇన్సోసిస్ వెల్లడించింది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షలు
అవుట్ సోర్సింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను ఇటీవల కాంలో మరో 6320కు పెంచింది సంస్థ. అయితే వీరి చేరికతో అవుట్ సోర్సింగ్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల 364 మందికి చేరుకొంది.ఫలితంగా పేరెంట్ కంపెనీలో ఆట్రిక్షన్ లెవల్స్ 15 శాతానికి పెరిగిందని వార్షిక సమీక్షలో ఇన్పోసిస్ వెల్లడించింది. గతేడాది 13.6 శాతం ఉంది.

ప్రాజెక్టులపై ప్రభావం
అమెరికా అద్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ప్రధానం ఐటీ పరిశ్రమపై పడింది. భారత్ కు చెందిన ఐటీ పరిశ్రమలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. హెచ్ 1 బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు అవుట్ సోర్సింగ్ పై కూడ ఆంక్షలు విధించారు. ఈ విధానాలు కూడ ఐటీ పరిశ్రమలపై పడుతున్నాయి.ఇన్పోసిస్ ను ఉద్యోగులు వదిలివెళ్ళడానికి ఇది కూడ ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications