Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్ సభ ఎన్నికల సర్వేలో షాక్, అధికార పార్టీ హ్యాపీ, ఆ పార్టీకి భారీ నష్టం?, లీడర్స్ కు తడి!

కర్ణాటకలో రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి, జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడటానికి వారం రోజులు కూడా సమయంలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ నేతలు ఎదురుచూస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో 20 స్థానాలు గెలవాలని కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జేడీఎస్‌లు 28 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నాయి. అంతర్గత నివేదికల ప్రకారం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ-జేడీఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, తాలూకా, జిల్లా స్థాయి నేతల నివేదికల ఆధారంగా మూల్యాంకనం జరుగుతుందని సంబంధిత సర్వే వర్గాలు తెలిపాయి.

Internal surveys have shown that the BJP will win only 17 Lok Sabha seats in Karnataka

లోక్‌సభ ఎన్నికల సమయంలో హాసన్‌కు చెందిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ సంచలనం సృష్టించింది. సెక్స్ స్కాండల్‌లో చిక్కుకున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ హాసన్‌లో గెలవడం అసాధ్యమని గుసగుసలు వినిపిస్తోంది. హాసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణ గెలుస్తారా అన్న క్యూరియాసిటీ నెలకొంది. మండ్య నుంచి జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కోలార్‌ నుంచి మల్లేష్‌ బాబు, బెంగళూరు గ్రామీణ నుంచి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అల్లుడు డాక్టర్‌ సీఎన్‌. మంజునాథ్‌లు జేడీఎస్‌ అభ్యర్థులుగా గెలుపొందనున్నారని సర్వేలు తెలిపాయి.

ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ పోలింగ్ జరిగిన దక్షిణ కర్ణాటక నుంచి మొత్తం 14 స్థానాలకు గాను 11 స్థానాలను బీజేపీ గెలుచుకోగలదని సర్వేలు అంటున్నాయి. మే 7వ తేదీన మూడో విడత ఎన్నికలు జరిగిన ఉత్తర కర్ణాటకలోని 14 స్థానాల్లో బీజేపీ ఆరింటిని గెలుచుకుంటుందని అంతర్గత నివేదికలు తెలిపాయి. కళ్యాణ కర్ణాటకలో బీజేపీ ఓటమిని ఎదుర్కొనే అవకాశం ఉందని అంతర్గత నివేదిక వెల్లడించింది.

Internal surveys have shown that the BJP will win only 17 Lok Sabha seats in Karnataka

అయితే బెంగళూరులోని నాలుగు స్థానాలతో సహా దక్షిణ కర్ణాటకలో బీజేపీ -జేడీఎస్ కూటమి సమర్థవంతంగా పనిచేసింది, ముఖ్యంగా పాత మైసూర్‌ ఒక్కలిగుల కోటలో కూడా బీజేపీ-జేడీఎస్ కూటమి సత్తా చూపిస్తుందని సర్వే నివేదికలు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు, జేడీఎస్, కాంగ్రెస్ ఒక్కో సీట్లు గెలుచుకోగా మండ్యలో స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత అంబరీష్ విజయం సాధించారు.

ఇప్పుడు కళ్యాణ కర్ణాటకలో కాంగ్రెస్ కు ఉచిత హామీలతో సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలు అంటున్నాయి. కళ్యాణ కర్ణాటకలో గతంలో గెలిచిన సీట్లను కూడా బీజేపీ కోల్పోవచ్చునని సర్వేలు అంటున్నాయి. కోస్టల్ కర్ణాటక, ముంబై-కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ తన స్థానాలను నిలుపుకుంటుందని బీజేపీ అంతర్గత వర్గాలు అంచనా వేస్తున్నాయి. కౌంటింగ్ కు రోజులు దగ్గర పడుతున్న సమయంలో కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+