‘అమ్మ’ అభివృద్ది చూడండి: ఐప్యాడ్ తో ప్రచారం
చెన్నై: తమిళనాడులో ఉప ఎన్నికలు ప్రచారం ఊపందుకుంది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో హై టెక్ ప్రచారం చేస్తున్నారు.

జయలలిత రెండో సారి సీఎం అయిన తరువాత చేపట్టిన పలు అభివృద్ది పనుల వివరాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లి క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఎలాగైనా మూడు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో గెలువాలని అన్నాడీఎంకే అభ్యర్థులు ఇలాంటి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని తంజావూరు, అరవకురిచి, తిరుపరాకుందం నియెజక వర్గాల్లో ఈ నెల 19వ తేదిన ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ నేపధ్యంలో అన్నాడీఎంకే నాయకులు హైటెక్ ఐ ప్యాడ్స్ తీసుకుని అందులో జయలలిత సీఎం అయిన తరువాత పేద ప్రజలకు ప్రవేశపెట్టిన అనేక పథకాలు, పూర్తి చేసిన అభివృద్ది పనుల వివరాలను ఐ ప్యాడ్ లో పెట్టి ప్రజల దగ్గరకు తీసుకు వెలుతున్నారు.
అమ్మ పేదల కోసం ఇలాంటి అభివృద్ది పనులు చేశారని గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అమ్మ చేపట్టిన అభివృద్ది పనుల పూర్తి వివరాలను ఐ ప్యాడ్ లలో ప్రజలకు చూపిస్తున్నారు. అన్నాడీఎంకే చరిత్రలో ఇలాంటి హైటెక్ ప్రచారం ఇప్పటి వరకు ఎన్నడూ చెయ్యలేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

జయలలిత ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తరువాత ఆమెకు ఈ మూడు నియోజక వర్గాల ఉప ఎన్నికల విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని అన్నాడీఎంకే నాయకులు నిర్ణయించారు. అన్నాడీఎంకే ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.
అమ్మ చేపట్టిన అభివృద్ది పనులు, పలు పథకాల పూర్తి సమాచారాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వెలుతున్నామని అన్నారు. అమ్మ చేపట్టిన అభివృద్ది పనుల వివరాలను వీడియో రూపంలో ప్రజల ముందుకు తీసుకు వెళ్లి వివరించి వారికి ఇంకా దగ్గర కావాలని నిర్ణయం తీసుకున్నామని రామచంద్రన్ అన్నారు.
అదే విధంగా ప్రజల అభిప్రాయాలను మేము ఐ ప్యాడ్ లో పొందుపరుస్తున్నామని, తప్పకుండా మూడు నియోజక వర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు విజయం సాధిస్తారని ఏఐఏడీఎంకే ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ జోస్యం చెప్పారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications