'బీజేపీకి ఓటేస్తే.. మా పాలనలో ఇస్లాం వృద్ధి'(ఫోటోలు)
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తే.. ఇస్లాం మతం మరింతగా వృధ్ధి చెందుతుందని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాఖ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ ఆరోరా సంచలన ప్రకటనలు చేశాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు.
ఆర్టికల్ 370 విషయంలో తాము ప్రజల అభిప్రాయానికి విలువనిస్తామని చెప్పాడు. ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఓటేస్తే..తమకు మరింత భద్రత లభిస్తుందన్న కాశ్మీరీల అభిప్రాయంపై విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
"బీజేపీ మతతత్వ పార్టీ అనే భావన కరెక్ట్ కాదు. కాశ్మీర్ అనేది సున్నీ సాధువుల నేల. మా హయాంలో రాష్ట్రంలో ఇస్లాం మెరుగైన వృద్ధి సాధిస్తుంది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుంది. కాశ్మీరీ సంస్కృతికి బీజేపీ ప్రమాదకరమన్న భావనలోనూ వాస్తవం లేదు. అలా ప్రచారం చేసే వారే అత్యంత ప్రమాదకారులు" అని ఆయన అన్నారు.

మా పాలనలో ఇస్లాం వృద్ధి: రమేశ్ ఆరోరా
భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తే.. ఇస్లాం మతం మరింతగా వృధ్ధి చెందుతుందని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాఖ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ ఆరోరా సంచలన ప్రకటనలు చేశాడు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ర్యాలీలో రాజ్నాధ్ సింగ్
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ను రద్దు చేసే విషయమై చర్చించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని హోం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ర్యాలీలో రాజ్నాధ్ సింగ్
గురువారం ఆయన కాశ్మీర్లో పర్యటించారు. ప్రస్తుతం ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో పంచాయితీ రాజ్ వ్యవస్ధను అమలు చేస్తామన్నారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ర్యాలీలో రాజ్నాధ్ సింగ్
1989లో 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన ఈ వ్యవస్థ దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్నా... జమ్మూ కాశ్మీర్లో మాత్రం అమలవడం లేదన్నారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ర్యాలీలో రాజ్నాధ్ సింగ్
దీంతో మిగతా రాష్ట్రాల మాదిరిగా కాశ్మీర్లోని గ్రామాలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు అందడం లేదు. తాము అధికారంలోకి వస్తే, గ్రామాలను నిధుల కొరత బారి నుంచి బయటపడేసే పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసి తీరుతామన్నారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ర్యాలీలో రాజ్నాధ్ సింగ్
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించడానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్నాద్ సింగ్ భద్రతను పర్యవేక్షిస్తున్న సైనిక బలగాలు.
ప్రస్తుతం ఎన్నికల్లో తమ పార్టీ 44 సీట్ల మార్కును దాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ను రద్దు చేసే విషయమై చర్చించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని హోం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు.
గురువారం ఆయన కాశ్మీర్లో పర్యటించారు. ప్రస్తుతం ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో పంచాయితీ రాజ్ వ్యవస్ధను అమలు చేస్తామన్నారు. 1989లో 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన ఈ వ్యవస్థ దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్నా... జమ్మూ కాశ్మీర్లో మాత్రం అమలవడం లేదన్నారు.
దీంతో మిగతా రాష్ట్రాల మాదిరిగా కాశ్మీర్లోని గ్రామాలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు అందడం లేదు. తాము అధికారంలోకి వస్తే, గ్రామాలను నిధుల కొరత బారి నుంచి బయటపడేసే పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసి తీరుతామన్నారు.












Click it and Unblock the Notifications