ఇస్రో సరికొత్త ప్రయోగం... విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ50...
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) గురువారం(డిసెంబర్ 17) పీఎస్ఎల్వీ-సీ50 వాహక నౌక ద్వారా కమ్యూనికేషన్ సీఎంఎస్-01 శాటిలైట్ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. సీఎంఎస్-01 శాటిలైట్ను పీఎస్ఎల్వీ-సీ50 నిర్ణీత కక్ష్యంలో ప్రవేశపెట్టనుంది. ఇది భారత్ ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ శాటిలైట్. దీని బరువు 1410 కిలోలు.
Recommended Video
బుధవారం మధ్యాహ్నం 2.41గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమవగా.. గురువారం సాయంత్రం 3.41గంటలకు పీఎస్ఎల్వీ-50 నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది కాగా... షార్ నుంచి ఇది 77వ మిషన్ అని ఇస్రో వెల్లడించింది.

తాజాగా నింగిలోకి పంపించిన సీఎంఎస్-01 ద్వారా భారత్లో మరింత మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

భారత్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు,లక్షద్వీప్ వరకూ దీని సేవలు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు.శ్రీహరి కోటలో రాకెట్ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications