సోనూ సూద్ నివాసాలపై ఐటీ దాడులు, కేజ్రీవాల్ ఏం అన్నారంటే.. - ప్రెస్రివ్యూ
సినీ నటుడు సోనూ సూద్ నివాసం, కార్యాలయాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
''పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్నవూ నగరాల్లోని సూద్కు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపామని అధికారులు తెలిపారు.
'లఖ్నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించా’అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు.
ఇటీవల సోనూసూద్.. దిల్లీ 'ఆప్’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్ను కూడా కలిశారు. ఆ సమయంలో ఆప్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై ఆప్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సోనూసూద్కు మద్దతుగా నిలిచింది.
కరోనా సమయంలో లక్షలాది కుటుంబాలకు సూద్ సాయం చేశారని.. వారంతా ఆయన కోసం ప్రార్థిస్తారని, ఈ కష్టకాలంలో మద్దతుగా నిలుస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కేజ్రీవాల్తో సమావేశమైనందుకే ఈ దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను బీజేపీ ఖండించింది’’అని ఈనాడు తెలిపింది.
- 1897 సారాగఢీ యుద్ధం: ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్లో ఎందుకు పెట్టారు?
- భారత న్యాయవ్యవస్థలో 'ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాల పురుషులే’ ఎక్కువా?
యువతిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరణ
''తనను దూరంగా ఉంచిన యువతిని ఓ వ్యక్తి చిత్రహింసలకు గురిచేస్తూ... ఆ వ్యవహారాన్ని వీడియో తీయించాడు. ఆ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు’’అని సాక్షి తెలిపింది.
''ఈ కేసులో గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు రామకోటయ్యనగర్కు చెందిన పల్లాల వెంకటేష్, కె.శివకుమార్ స్నేహితులు. వెంకటేష్ టిప్పర్ డ్రైవర్. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అతనిని విడిచి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో వెంకటేష్ ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనిని దూరంగా ఉంచుతూ వచ్చింది. దీనిని అతను జీర్ణించుకోలేకపోయాడు.
సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాజులు పగిలి రక్తస్రావం అవుతున్నా కనికరించలేదు. బాధిత యువతి తనను వదిలేయాలని కన్నీటి పర్యంతమైనా పట్టించుకోకుండా దాడి చేస్తూ ఆ వ్యవహారాన్ని స్నేహితుడు శివకుమార్ ద్వారా వీడియో తీయించాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
మూడు నెలల అనంతరం బుధవారం వాట్సాప్, ట్విట్టర్, పలు చానళ్లలో యువతిని చిత్రహింసలు పెడుతున్న వీడియో వైరల్ అయింది. దీనిపై ఎస్పీ విజయారావు స్పందించి.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
సాంకేతికత సాయంతో వీడియోలోని నిందితులను గుర్తించి, తెగచర్లలో వారిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు’’అని సాక్షి తెలిపింది.
- 'జాక్ మా' లాంటి పారిశ్రామిక దిగ్గజాలను చైనా ఎందుకు 'ఇబ్బంది పెడుతోంది’
- ఐపీఎల్ కోసమే INDvsENG ఐదో టెస్టు రద్దు చేశారా? ఈ ప్రశ్నకు బీసీసీఐ ఛీఫ్ సౌరవ్ గంగూలీ సమాధానం ఏంటి?
కెల్విన్, జీషాన్అలీ పార్టీల్లో తెలుసు- డ్రగ్స్ కేసు విచారణలో ముమైత్ ఖాన్
స్నేహితులతో కలిసి హైదరాబాద్లో కొన్ని పార్టీల్లో తాను పాల్గొన్నానని, డ్రగ్స్ కేసుల్లో నిందితులైన కెల్విన్, జీషాన్ అలీ అక్కడే తెలుసునని, అయితే వారితో తనకు ఆర్థిక సంబంధాలు లేవని ఈడీ అధికారులకు సినీనటి ముమైత్ ఖాన్ చెప్పారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
''టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ముమైత్ విచారణకు హాజరయ్యారు. తన బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్లను అధికారులకు ఆమె సమర్పించారు.
ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారణ కొనసాగింది. 7 గంటల పాటు ముమైత్ను ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితులైన కెల్విన్, జీషాన్ అలీతో గల ఆర్థికసంబంధాలపై విచారించారు.
తన బ్యాంక్ స్టేట్మెంట్లలోని అనుమానాస్పద లావాదేవీలపై ఆమె నుంచి వివరణ తీసుకున్నారు. కాగా, ముమైత్ బ్యాంక్ ఖాతా నుంచి ఎఫ్-క్లబ్కు నగదు బదిలీ అయినట్లుగా ఈడీ గుర్తించింది. అవి పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ఆమె వివరణ ఇచ్చారు.
ఇప్పటికే ముమైత్ ఖాన్ సహా పూరి జగన్నాథ్, చార్మికౌర్, రకుల్ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, నందు, రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్-క్లబ్ జీఎంను ఈడీ ప్రశ్నించింది. ఇక తనీశ్, తరుణ్ మిగిలి ఉన్నారు. తనీశ్ గురువారం విచారణకు హాజరుకానున్నారు. 22న తరుణ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
- తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన
- బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి
మిర్చి బజ్జీ గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
గొంతులో మిర్చి బజ్జి ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణలోని మహబూబ్నగర్లో చోటుచేసుకుందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
''హైదరాబాద్లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామమైన మిజ్జిల్కు వచ్చాడు.
రాత్రి ఇంటి మిద్దెపై కూర్చోని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర్చి తింటుండగా మిర్చి గొంతుకు అడ్డుపడడంతో మృతి చెందాడు.
తెల్లవారుజామున కుటుంబ సభ్యులు మిద్దె పైకి వెళ్లేసరికి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు.
హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)