IT HUB: రాష్ట్రంలో 21 వేల కరోనా పాజిటివ్ కేసులు, ఐటీ హబ్ లో మాత్రమే 15 వేలు, ప్రజలు హడల్ !
బెంగళూరు: కరోనా వైరస్ థర్డ్ వేవ్ దెబ్బతో భారతదేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. కర్ణాటకలో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. ఒక్కరోజులో కర్ణాటకలో 21, 390 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయితే బెంగళూరులో మాత్రమే 15, 617 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోతున్నారు.
Illegal affair: కండెక్టర్ లవ్ మ్యారేజ్, భర్త బస్సులో విజిల్ వేస్తుంటే భార్య ?, పెళ్లికి ముందే !
హడలిపోతున్న కన్నడిగులు
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. కర్ణాటకలో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈనెల చివరి వారం వరకు వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఒక్కరోజులో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
కర్ణాటకలో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. ఒక్కరోజులో కర్ణాటకలో 21, 390 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయితే బెంగళూరులో మాత్రమే 15, 617 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఒక్కరోజులో 10.96 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ బుధవారం కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి ఓ ట్విట్ చేశారు. ఒక్కరోజులో కర్ణాటకలో 10.96 శాతం కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగాయని, 24 గంటల వ్యవధిలో 1, 541 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారని వివరించారు.
ఐటీ హబ్ లో హడలిపోతున్న ప్రజలు
కర్ణాటకలో 93, 009 కరోనా పాజిటివ్ యాక్టీవ్ కేసులు ఉన్నాయని, బెంగళూరులో 73 వేల యాక్టీవ్ కేసులు ఉన్నాయని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు. గత 24 గంటల్లో కర్ణాటకలో 1, 95, 047 కోవిడ్ పరీక్షలు నిర్వహించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు. ఐటీ హబ్ బెంగళూరులో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వెలుగు చూడటంతో బెంగళూరు ప్రజలు హడలిపోతున్నారు.