మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీలను టార్గెట్ చేసిన బాబారాందేవ్: ‘గోమూత్రం 5ఉత్పత్తుల్లోనే’
ఐదు పతంజలి ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామని యోగా గురు బాబారాందేవ్ స్పష్టం చేశారు. పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలిపామని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని
న్యూఢిల్లీ: ఐదు పతంజలి ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామని యోగా గురు బాబారాందేవ్ స్పష్టం చేశారు. పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలిపామని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఐదు ఉత్పత్తుల్లోనే..
తాము కేవలం ఐదు రకాల మందుల్లోనే గోమూత్రం కలిపామని రాందేవ్ బాబా స్పష్టం చేశారు. గోమూత్రం కలిపామనే విషయాన్ని ఆయా మందుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొన్నామని బాబా రాందేవ్ వివరించారు.
ఆ మందులో మాత్రమే..
న్యూఢిల్లీలో జరిగిన వార్షిక మీడియా సమావేశంలో రాందేవ్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. . కేన్సర్ నివారణ కోసం పంచగోయ మందులో గోమూత్రం కలిపామని బాబా రాందేవ్ తెలిపారు.
కేఎఫ్సీ, మెక్ డొనాల్డ్స్ను టార్గెట్ చేసిన బాబా రాందేవ్
ఇప్పటికే బహుళ జాతి కంపెనీలకు ప్రధాన పోటీదారుగా మారిన పతంజలి సంస్థ.. ఇప్పుడు మెక్ డోనాల్డ్స్, కేఎఫ్సీ, సబ్ వే రెస్టారెంట్లను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా రెస్టారెంట్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాలని పతంజలి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అసలైన రుచులు
అసలైన భారతీయ వంటకాలను అందించడం ద్వారా వాటికి పోటీగా మారేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్ల చైన్ ఏర్పాటు చేయాలనే యోచనను అమల్లోకి తీసుకొచ్చేందుకు పతంజలి గ్రూపు తీవ్ర కసరత్తులు చేస్తోంది. పతంజలి ఇప్పటికే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులతో బహుళ జాతి కంపెనీలకు తీవ్ర పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే.