లాకర్ లో రూ. 800 కోట్ల అక్రమ ఆస్తుల కేసు: బీజేపీ లీడర్ ప్రసాద్ రెడ్డి ఇంటిలో ఐటీ దాడులు!
బెంగళూరు: బెంగళూరు బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని మూడు లాకర్లలో స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, బంగారు, రూ. వందల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు పరిశీలించిన ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు బీజేపీ నాయకుడి ఇంటి మీద దాడులు చేశారు.
బెంగళూరు నగరంలోని కోరమంగలలో నివాసం ఉంటున్న ప్రసాద్ రెడ్డి అనే బీజేపీ నాయకుడి ఇంటిలో సోమవారం ఉదయం నుంచి ఐటీ శాఖ సోదాలు జరుగుతున్నాయి. బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని లాకర్లలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు, ఆస్తుల పత్రాలకు రాజకీయ నాయకులకు సంబంధం ఉందని మొదట నుంచి ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని మూడు లాకర్లు గుజరాత్ కు చెందిన వ్యాపారి అవినాష్ ఉపయోగిస్తున్నాడని ఐటీ శాఖ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. లాకర్లలో చిక్కిన లాకర్లలోని నగదు, బంగారం, ఆస్తుల ప్రతాల విషయంలో విచారణను అడ్డుకోవడానికి కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

ఇదే సందర్బంలో బెంగళూరు నగరంలోని కోరమంగలలోని బీజేపీ నాయకుడు ప్రసాద్ రెడ్డి ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు. ప్రసాద్ రెడ్డితో పాటు లాకర్లు ఉపయోగించిన వ్యాపారి అవినాష్ ను అధికారులు విచారణ చేస్తున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications