హైదరాబాద్ పర్యటనపై ఇవాంకా ట్వీట్.. స్పందించిన మోడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ తన భారత పర్యటనపై ఆత్రుతగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇవాంకా ట్రంప్ తాజాగా ఒక ట్వీట్ చేయగా, దీనికి ప్రధాని మోడీ కూడా స్పందించారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ తన భారత పర్యటనపై ఆత్రుతగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్లో జరిగే జీఈఎస్(గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సు)లో ఇవాంకా పాల్గొననున్న సంగతి తెలిసిందే.
రియల్ రోల్ మోడల్.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..
పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?
ఈ విషయమై ఇవాంకా ట్రంప్ తాజాగా ఒక ట్వీట్ కూడా చేశారు. 'ప్రధాని మోడీతో కలిసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్యవేత్తలను కలుసుకునేందుకు వెళుతున్నాను. ఈ పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది..' అని ఇవాంకా ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు.
This week, Global Entrepreneurship Week, spotlights the incredible contributions of innovators across the globe. I am excited to join many of these remarkable entrepreneurs with Prime Minister @narendramodi in India for #GES2017 in just two weeks!https://t.co/pcJfsPwTqv
— Ivanka Trump (@IvankaTrump) November 14, 2017
We look forward to welcoming you @IvankaTrump. Closer economic cooperation between India and USA helps our people, particularly our talented and innovative entrepreneurs. https://t.co/DaLrExsRMJ
— Narendra Modi (@narendramodi) November 15, 2017
దీనికి మన ప్రధాని మోడీ రీట్వీట్ చేస్తూ.. ఇవాంకాకు స్వాగతం పలికారు. 'మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుంది. భారత్లోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం..' అని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.