విష్ణువు 11వ అవతారం జయలలిత..: అన్నాడీఎంకె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
సభలో ప్రసంగిస్తున్న సమయంలో జయలలిత గురించి పదేపదే ప్రస్తావిస్తూ.. ఆమెను విష్ణువు అవతారంగా పోల్చారు.
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అంటే ఆ పార్టీ నేతలకు ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యక్తిపూజకు కేరాఫ్గా కనిపించే తమిళ పాలిటిక్స్.. కొన్ని విషయాల్లో పరాకాష్టను తలపిస్తాయి. తాజాగా అన్నాడీఎంకె పార్టీ ఎమ్మెల్యే ఒకరు జయలలితను విష్ణువు 11వ అవతారంగా అభివర్ణించారు.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గురువారం నాటి సభలో మరియప్పన్ కెన్నడీ అనే ఎమ్మెల్యే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో జయలలిత గురించి పదేపదే ప్రస్తావిస్తూ.. ఆమెను విష్ణువు అవతారంగా పోల్చారు. అంతేకాదు, ప్రస్తుతం ఆ స్థానంలో శశికళ ఉన్నారని, అలాగే దినకరన్ కూడా తమకు వెలుగుచూపించే వ్యక్తి లాంటి వాడని మరియప్పన్ అభిప్రాయపడ్డారు.

అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాల్సిందిగా డిమాండ్ చేశాయి.
అన్నాడీఎంకె ఎన్నికల గుర్తు 'రెండాకుల' కోసం పన్నీర్, పళనిస్వామి వర్గాలు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు దాఖలు చేసిన మరుసటిరోజే మరియప్పన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications