ఆర్మీ గస్తీ బృందంపై రాళ్లవర్షం.. కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి, 9 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లా గనౌపుర ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఆర్మీ గస్తీ బృందంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులను నిలువరించేందుకు గస్తీ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు.
శ్రీనగర్: ఆర్మీ గస్తీ బృందంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులను నిలువరించేందుకు గస్తీ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లా గనౌపుర ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆర్మీ గస్తీ బృందంపై కొందరు యువకులు రాళ్లవర్షం కురిపించడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తిందని, ఇందుకు ప్రతిగా ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించిన యువకుడిని 17 ఏళ్ల జావిద్ అహ్మద్ భట్గా గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి ఆర్మీపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కశ్మీర్ లోయలో రాళ్లు రువ్విన కేసుల్లో ఆందోళనకారులకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఈ తాజా ఘటన చోటుచేసుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications