Jagdeep Dhankar: రాజీనామా కు ముందే ధన్ కర్ షాకులు..! అవాక్కైన రాష్ట్రపతి భవన్ ?
కేంద్రంతో వివాదాల నేపథ్యంలో ఆరోగ్య కారణాలు చూపుతూ ఆకస్మికంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసేసిన జగ్ దీప్ ధన్ కర్.. తన నిర్ణయంతో దేశ ప్రజలకు, రాజకీయ పార్టీలకు, చివరికి సొంత పార్టీ బీజేపీకి కూడా షాకిచ్చారు. అదే సమయంలో రాజీనామాకు ముందే ఆయన ఏకంగా రాష్ట్రపతి భవన్ కే షాకిచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ రాష్ట్రపతి భవన్ కు ధన్ కర్ ఎలా షాకిచ్చారో చూద్దాం..
మొన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఆరోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగ్ దీప్ ధన్ కర్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను జత చేశారు. ఇందులో తన పదవీకాలంలో అన్ని విధాలా సహకరించిన రాజకీయ పార్టీలు, నాయకులు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లేఖ క్షణాల్లో దేశమంతా వైరల్ అయిపోయింది. దీంతో ధన్ కర్ రాజీనామాపై అధికార, విపక్షాల నాయకులు ఆరా తీయడం ప్రారంభించారు.

ఇలా ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయకముందు జగ్ దీప్ ధన్ కర్ ఢిల్లీలోని తన నివాసం నుంచి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. కాసేపటికే అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ కూడా ఆయన తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంత రాత్రి సమయంలో అదీ ఉప రాష్ట్రపతి స్వయంగా రావడంతో రాష్ట్రపతి భవన్ సిబ్బంది అవాక్కయ్యారు. చివరికి రాష్ట్రపతి ముర్ముకి వెంటనే సమాచారం తెలియజేసి ధన్ కర్ ను లోపలికి అనుమతించారు.

ధన్ కర్ అంత రాత్రి పూట రాష్ట్రపతి భవన్ కు రావడంతో అక్కడి సిబ్బంది వెంటనే ఆయన్ను రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. చివరికి రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన ధన్ కర్ తన పదవికి ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత 9.25 సమయంలో ఎక్స్ లో తన రాజీనామా లేఖను ధన్ కర్ పోస్టు చేసారు. దీంతో ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications