మత రాజకీయాలకు కౌంటర్-జహంగీర్ పురిలో స్ధానికుల తిరంగా యాత్ర-తామంతా ఒకటేనంటూ
దేశవ్యాప్తంగా పెరుగుతున్న మతపరమైన అసహనం, మతఘర్షణలకు చెక్ పెడుతూ ఢిల్లీలోని జహంగీర్ పురీ వాసులు తాజాగా తిరంగాయాత్ర నిర్వహించారు. కులమతాలు, ప్రాంతాలు వేరైనా తామంతా భారతీయులమేనంటూ చాటారు. రెండు వారాల క్రితం మతఘర్షణలతో అట్టుడికిన ఈ ప్రాంతంలో స్ధానికులు నిర్వహించిన తిరంగా యాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
"హిందూ ముస్లిం సిఖ్ ఇసాయ్ ఆపస్ మే హై భాయ్ భాయ్" మరియు "భారత్ మాతా కీ జై" వంటి నినాదాలు చేస్తూ జహంగీర్ పురిలోని దాదాపు 200 మంది స్ధానికులు కవాతు చేశారు. శాంతి, మత సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నంలో, అల్లర్లకు గురైన జహంగీర్పురిలో దాదాపు 200 మంది నివాసితులు ఆదివారం ఆ ప్రాంతంలోని దుకాణాలు, ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఆ ప్రాంతంలో 'తిరంగా యాత్ర' చేపట్టారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది.
All's Well That Ends Well… Chants of Vande Mataram & Bharat Mata ki Jai during #TirangaYatra at #jahagirpuri . pic.twitter.com/4VaCC4BrRX
— Anand Prakash Pandey (@anandprakash7) April 24, 2022
హిందూ, ముస్లిం స్ధానికులు ఇద్దరూ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని, "హిందూ ముస్లిం సిఖ్ ఇసాయ్ ఆపస్ మే హై భాయ్ భాయ్" మరియు "భారత్ మాతా కీ జై" వంటి నినాదాలు చేస్తూ కనిపించారు. వృద్ధులు మరియు పిల్లలతో కూడిన ఈ మార్చ్ C బ్లాక్ నుండి ప్రారంభమైంది. కుశాల్ సినిమా ఎదురుగా ఉన్న బ్లాక్ రౌండ్అబౌట్, దానిని అనుసరించి బి బ్లాక్ మార్కెట్ వైపు వెళ్లింది. జనం చివరికి హిందువులు మెజారిటీ ఉన్న G బ్లాక్ వైపు వెళ్లారు. దాదాపు 30 నిమిషాల తర్వాత యాత్రను ముగించారు. ఈ మార్చ్కు స్థానిక ఆర్ డబ్ల్యూఏ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఆ ప్రాంతంలోని చాలా దుకాణాలు, ఇళ్ల వెలువల వెలుపల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సి-బ్లాక్లోని నివాసి అమ్జద్ అలీ, యాత్రకు హాజరు కావడానికి తన పిల్లలను పంపానని, స్థానికంగా శాంతిభద్రతలకు మద్దతునిచ్చేందుకు తన ఇంటిపై, చికెన్ షాప్ పైన జెండాను ఎగురవేసినట్లు చెప్పారు. మూడు రోజుల క్రితమే ఆ ప్రాంతంలో అలాంటి యాత్ర జరుగుతోందని నాకు తెలిసింది. అందుకే నా పిల్లలను అందులో పాల్గొనాలని పంపానన్నారు. వారు కూడా (పిల్లలు) చాలా రోజుల గందరగోళం తర్వాత బయటకు వచ్చారన్నారు ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు

జనం సజావుగా వెళ్లేందుకు వీలుగా మార్చ్ సందర్భంగా సి-బ్లాక్ రౌండ్అబౌట్ నుండి బారికేడ్లను పోలీసులు తొలగించారు. ఢిల్లీ పోలీసుల బృందాలతో పాటు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఆ ప్రాంతంలో మోహరించారు. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్పురిలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 'శోభా యాత్ర' జరిగిన తర్వాత మత ఘర్షణలు చెలరేగిన కొద్ది రోజుల తర్వాత ఈ యాత్ర నిర్వహించారు. రాళ్లదాడి, విధ్వంసం వంటి సంఘటనలతో హింస పెరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు. గత వారం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (NDMC) ఈ ప్రాంతంలో "ఆక్రమణ నిరోధక" డ్రైవ్ను నిర్వహించి, అనేక దుకాణాలను కూల్చివేసింది. సి-బ్లాక్లోని ముస్లిం నివాసితులు. తర్వాత సుప్రీంకోర్టు డ్రైవ్పై స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications