జయలలిత కోసం ఆగిన 16 గుండెలు, బస్సులు దగ్ధం
చెన్నై: అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత జైలుకెళ్లడాన్ని తట్టుకోలేని ఆమె అభిమానుల గుండెలు ఆగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు జయలలితకు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడైన తర్వాత రాష్ట్రంలో 16 మంది మరణించారు.
ఆమె జైలుకెళ్లడం తట్టుకోలేని ఆమె అభిమానులు తొమ్మిది మంది గుండెపోటుతో మరణిస్తే, మరో ఐదుగురు ఆమె కోసం ఆత్మహత్య చేసుకున్నారు. జయలలిత జైలుకెళ్లిన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా ఆదివారం సాయంత్రానికి పరిస్థితి ప్రశాంతస్థితికి చేరుకుంది.

అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడక్కడా దుకాణాలు మూసివేయించారు. కొన్నిచోట్ల తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. నాగపట్నం సమీపంలో టోల్ ప్లాజా వద్ద నిలిపిన ఓ కారును దహనం చేశారు. కన్యాకుమారి జిల్లాలో కేరళ సరిహద్దుల్లో ఆందోళనకారులు వాహనాల పైన రాళ్లు రువ్వారు.
శనివారం కాంచీపురంలో బస్సు దహనం ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాగా, జైలు శిక్ష పడిన జయలలిత పదవీచ్యుతి కావడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, శాంతిభద్రతలు లోపించాయని పేర్కొంటూ మద్రాసు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి పైన కోర్టు స్టేటస్ రిపోర్టు కోరింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications