'జయలలిత ట్రీట్మెంట్ వివరాలు ఇస్తాం, సీల్డ్ కవర్లో వెల్లడిస్తాం'
జయలలితకు అందించిన చికిత్సకు సంబంధించిన వివరాలు కోర్టుకు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అపోలో ఆసుపత్రి తెలిపింది.
చెన్నై: దివంగత జయలలిత చికిత్స పైన మద్రాస్ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ఆమెకు అందించిన చికిత్సకు సంబంధించిన వివరాలు కోర్టుకు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అపోలో ఆసుపత్రి తెలిపింది.
కారు ఎందుకు తిరిగిచ్చావ్: అతనిని అడిగిన శశికళ, తిరిగొచ్చాడు
జయలలిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు అందించిన చికిత్స వివరాలు అందించాలని కోర్టుకు ఎక్కారు. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది.
చికిత్స వివరాలు అందిస్తామని అపోలో ఆసుపత్రి తరఫు లాయర్ రామస్వామి హైకోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.
జయలలిత గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు, జయలలిత మృతి పైన తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. తాము సీల్డ్ కవర్లో వివరాలు వెల్లడిస్తామని చెప్పింది.