రాజపక్ష: మోడీ ప్రమాణానికి జయలలిత, వైగో డుమ్మా
చైన్నై: కాబోయే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి తమిళ సమస్య భారమయ్యేట్లే ఉంది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించాలనే నిర్ణయం తీసుకోవడంతో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఎండింఎంకె నేత వైగో డుమ్మా కొట్టే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజపక్ష హాజరైతే తమిళ ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయనే ఉద్దేశంతో వారున్నారు. శ్రీలంకలోని తమిళుల సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్న జయలలిత మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజపక్షను ఆహ్వానించాలనే బిజెపి నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఎల్టిటిఇపై పోరాటంలో కాంగ్రెసు ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి సాయం చేసిందని, ఇందులో వేలాది మంది తమిళ పౌరులు హతమయ్యారని వైగో బుధవారంనాడు అన్నారు. ఈ స్థితిలో రాజపక్షకు ఆహ్వానం పంపడం తమకు పెద్ద దెబ్బ అని ఆయన అన్నారు
రాజపక్ష అధికారంలో ఉండగానే ఎల్టిటిఇపై పోరులో తమిళ పౌరులు శ్రీలంకలో మరణించారని వైగోతో పాటు పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. సార్క్ దేశాల నాయకులను ఆహ్వానిండంలో భాగంగానే శ్రీలంక అధ్యక్షుడికి ఆహ్వానం వెళ్లిందని కేంద్రం సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications