మోడీ పొరపాటు చేస్తున్నారు, అందుకే కేజ్రీ గెలుపు: లోక్సత్తా జేపీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పొరపాటు చేస్తున్నారని, పార్లమెంటు ఎన్నికలు వేరు, రాష్ట్రాల ఎన్నికలు వేరని లోక్సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ మంగళవారం అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన ఆయన స్పందించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేశారో ఆ పార్టీ ఆలోచించాలని హితవు పలికారు.
ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలంతా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారని చెప్పారు. గత ఎన్నికల్లో 28 స్థానాలు ఇచ్చిన ప్రజలు... ఇంకా కొంచెం కష్టపడితే ఏఏపీని గెలుస్తుందని భావించడం వల్లే ఇంత భారీ విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్థానమయిందన్నారు. ఢిల్లీ ప్రజలు కులమతాలు చూసి ఓట్లు వేయలేదని చెప్పారు. సంప్రదాయ రాజకీయ వారసత్వానికి కాంగ్రెస్ పార్టీ పరాకాష్ట అని మండిపడ్డారు. వారసత్వ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుపోయిందని అన్నారు.
అదే విధంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా బీజేపీ నడవడం లేదని విమర్శించారు. ప్రజలు మార్పు కోసమే మోడీని గెలిపించారని, దానిని గుర్తించాలన్నారు. ఎవరి స్థానంలో వారు పని చేయాలన్నారు. ఓట్లు, సీట్ల కోసం చూడవద్దని చెప్పారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications