కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ: పోలీసులతో ఘర్షణ
బెంగుళూరు: పోలీసుల మీద జులుం ప్రదర్శించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కోర్టులో లొంగిపోయారు. జాతరలో జరిగిన ఓ ఘర్షణలో ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానిక ఎస్ఐ, సీఐలను దూషించడం అక్కడి టీవీ చానెళ్లలో ప్రసారమైంది.
దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మాగడిలోని ఒకటవ జేఎంఎఫ్సీ కోర్టులో ఎమ్మెల్యే బాలకృష్ణ లొంగిపోయారు. ఘటన విషయానికొస్తే.. అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది.
ఘటనలో ఇరువర్గాలు దాడులకు దిగారు. దీంతో తమ వర్గం వారి మీద దాడి చేసినవారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐల మీద ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అసభ్య పదజాలంతో వారిని దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి.

విషయం తెలుసుకున్న కూదురు సీఐ నందీశ్ జిల్లా ఎస్పీ రమేష్ కు ఫిర్యాదు చేశారు. పైగా ఎమ్మెల్యే పోలీసులను దూషించిన చిత్రాలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ఆయనపై కూదూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే తనను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దమయ్యారన్న విషయం తెలియగానే ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మాగడిలోని జేఎంఎఫ్సీ కోర్టులో లొంగిపోయారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications