విద్యార్ధి బట్టలు విప్పి నగ్నంగా గదిలో బంధించి చితక్కొట్టారు
పాట్నా: బీహార్లో ఆటవిక పాలన కొనసాగుతుందనడానికి సజీవ సాక్ష్యమే ఈ వీడియో. రాజధాని పాట్నాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి గదిలో బంధించి చితక్కొడుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
అధికార పార్టీ జేడీయూకు చెందిన విద్యార్థి విభాగం నేతలు ఈ దాష్టీకానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటన రెండు నెలల కిందటే జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం జేడీయూ విద్యార్థి విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి మనీశ్ మాలిక్ శివం అనే విద్యార్థిని కిడ్నాప్ చేశాడు.

అనంతరం ఓ గదిలో బందించి ఆ విద్యార్థి బట్టలు విప్పేసి మరికొందరితో కలసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన తాజాగా బయటకు రావడంతో విపక్ష నేతలు అధికార జేడీయుపై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications