ముంబైకి బ్రస్సెల్స్ ఉగ్రదాడి బాధితురాలు నిధి చాపేకర్
ముంబై: గత మార్చిలో బ్రస్సెల్స్ ఎయర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగిని నిధి చాపేకర్ శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. 42 ఏళ్ల నిధి చాపేకర్ గాయాల నుంచి కొంతమేరకు కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ముంబైకి తిరిగి వచ్చారు.
మార్చి నెలలో బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన నిధి చాపేకర్ అక్కడ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. అయితే ఇంకా 15 శాతం గాయాల నుంచి కోలుకోవాల్సి ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబైకి చేరుకోగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు.
ఆమె రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు. 1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్ మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆ సమయంలో ఎయిర్ పోర్టులో ఉగ్రదాడి జరగడంతో ఆమె శరీరానికి 15 శాతం గాయలు అవ్వడంతో పాటు చీలమండ విరిగిపోయింది. ఈ ఉగ్రదాడిలో జరిగినప్పటి నుంచి ఆమె బ్రసెల్స్కు సమీపంలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందారు.
అనంతరం గురువారం సాయంత్రం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నిధి చాపేకర్ ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థతి ఏర్పడింది.
దీంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఆమెతో పాటు బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన ఉగ్రదాడిలో గాయపడిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications