మద్యం సీసాలపై ఓటు వేయాలని స్టిక్కర్లు, తీవ్ర విమర్శలు: నిర్ణయం వెనక్కి
భోపాల్: త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లలో ఓటు హక్కు పైన అవగాహన పెంచి, ఓట్ల శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా అధికారులు కొత్త ఆలోచన చేశారు. కానీ అధి వివాదాస్పదమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల సాతాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం మద్యం సీసాల పైన ఓటర్లను చైతన్యపరిచే నినాదాలతో స్టిక్కర్లను అంటించింది. ఇందుకు సంబంధించిన స్టిక్కర్లను కొన్ని రోజుల క్రితమే స్థానిక మద్యం దుకాణదారులకు పంపిణీ చేశారు.

స్టిక్కర్లను మద్యం సీసాలపై అతికించాల్సిందిగా దుకాణదారులను కోరింది. కానీ దీనిపై విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లో మద్యాన్ని ప్రోత్సహిస్తారా అని దుమ్మెత్తి పోశారు. దీంతో అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఓటర్లను చైతన్యపరిచే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుందని, అయితే అన్నిఅంశాలను పరిశీలించిన అనంతరం దీనిని వెనక్కి తీసుకున్నామని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 28వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications