Jharkhand Assembly Elections Live: ముగిసిన తుది విడత పోలింగ్.. నేతల రాత బ్యాలెట్ బాక్సుల్లో..
రాంచీ: జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కు సర్వ సిద్ధమైంది. తుది దశలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి ఇప్పటిదాకా నాలుగు దశల్లో పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటం వల్లే కేంద్ర ఎన్నికల కమిషన్ అయిదు దశల్లో పోలింగ్ను ప్రకటించింది.
ప్రస్తుతం జార్ఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు విసిగిపోయారని, ఈ సారి తమకు పట్టం కడతారని కాంగ్రెస్ చెబుతోంది.
శుక్రవారం డిసెంబర్ 20వ తేదీన ఐదో విడుత ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. ఐదు విడతల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పలు న్యూస్ ఛానెల్లు ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఇతర మంత్రుల జాతకాలు బట్టబయలు కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్ట కడుతారా? లేక కాంగ్రెస్కు అధికారాన్ని అప్పగించునున్నారా? అనే అంశం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో పోలింగ్, ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ మీ కోసం..
झारखंड विधानसभा चुनाव में आज पांचवें और आखिरी चरण का मतदान है। सभी मतदाताओं से मेरी विनती है कि वे लोकतंत्र के इस महोत्सव में शामिल होकर रिकॉर्ड मतदान करें।
— Narendra Modi (@narendramodi) December 20, 2019
పోలింగ్ ప్రారంభం
Jharkhand: Visuals from a polling booths in Pakur, ahead of voting for Assembly elections. Voting on 16 constituencies in the state for the fifth phase of elections will be held today. #JharkhandAssemblyPolls pic.twitter.com/M80GFuYEFJ
— ANI (@ANI) December 20, 2019