తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి, కొడుకు పేరు మోసిన గ్యాంగ్ స్టర్
తండ్రి పోలీసు అధికారి, ఆయన పోలీస్ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు.కాని, కొడుకు మాత్రం ఘరానా రికార్డులున్న నేరగాడిగా మారాడు. ఆయనపై ఆరు రాష్ట్రాల్లో కేసులున్నాయి. పైగా 50 కోట్లరూపాయాలను సంపాదించాడు.
జంషెడ్ పూర్: తండ్రి పోలీసు అధికారి, ఆయన పోలీస్ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు.కాని, కొడుకు మాత్రం ఘరానా రికార్డులున్న నేరగాడిగా మారాడు. ఆయనపై ఆరు రాష్ట్రాల్లో కేసులున్నాయి. పైగా 50 కోట్లరూపాయాలను సంపాదించాడు.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అఖిలేష్ సింగ్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఆయన నేర చరిత్ర చూస్తే స్థానికులు భయబ్రాంతులు చెందుతారు.35 ఏళ్ళ అఖిలేష్ సింగ్, జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ చూడటానికి పొడవుగా అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు. కానీ, చేతలు మాత్రం దుర్మార్గంగా ఉంటాయి.
2002 లో జంషెడ్ పూర్ లో జైలర్ ఉమాశంకర్ పాండేను హత్య చేశాక అఖిలేష్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అతనికి జీవితకాలంపాటు జైలు శిక్ష పడింది.

ఇద్దరు పోలీసులు, శత్రువులపై ఆయన దాడి చేశారు. తన మనుషుల ద్వారా జంషెడ్ పూర్ తో పాటు ఇతర నగరాల్లోకి వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయించాడు. గత ఏడాది బెయిల్ వచ్చాక పారిపోయాడు.
ఇటీవలే కోర్టు ఆవరణలోనే వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఉపేంద్రసింగ్ ను హత్య చేయించాడని ఆరోపణలున్నాయి.అతనిపై ఇంకా జార్ఖండ్ , బీహర్, ఉత్తర్ ప్రదేశ్ లో కేసులు నమోదయ్యాయి.
అఖిలేష్ పేరిట 17 నకిలీ పాన్ కార్డులు, 14 ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులున్నాయి. జార్ఖండ్ , ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లో స్థిరాస్తులున్నాయి. పోలీసులు ఇటీవల జంషెడ్ పూర్ లోనే అఖిలేష్ ప్లాట్ పై దాడిచేసినప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగుచూసినట్టు పోలీసులు తెలిపారు.
అతని ఆస్తులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్తులన్నీ మారుపేర్లతో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపించాల్సిందిగా కోరనున్నట్టు చెప్పారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications