హింసతో దేనిని సాధించలేం, దాడులు సరికాదు: సీఎం ముఫ్తీ
హింసతో ఎవరూ ఏమీ సాధించలేరని, మిలిటెంట్లు ఆయుధాలు వదిలేయాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనగలమన్నారు.
శ్రీనగర్: హింసతో ఎవరూ ఏమీ సాధించలేరని, మిలిటెంట్లు ఆయుధాలు వదిలేయాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనగలమన్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బుద్గాంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఏడు గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్, కొందరు యువకులు రాళ్లు రువ్వుతూ పోలీస్ ఆపరేషన్కు అడ్డుతగలడం వంటి సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. రాళ్లు రువ్విన నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతాదళాలు జరిగిన పెల్లెట్ గన్ ఫైరింగ్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు.
ఈ పరిణాలపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడారు. హింస దేనికీ పరిష్కారం కాదన్నారు. దాడులు, ఎన్కౌంటర్లలో ఏటా వందలాది ఉగ్రవాదులతో పాటు అమాయక పౌరులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారమన్నారు. హింసకు ప్రజలు ఆకర్షితులు కావద్దన్నారు. బుద్గాం వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications